• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

NTR: రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం జాయింట్ డైరెక్టర్ తెహ్రీ సుల్తానా విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, రెడ్డిగూడెంలో ఈ ఆదర్శ పాఠశాలలు ఉన్న సంగతి విధితమే. మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించవలసినదిగా DEO ఉత్తర్వులు జారీ చేశారు.

May 1, 2025 / 01:14 PM IST

కార్మికుల సంక్షేమమే సీఎం లక్ష్యం: మంత్రి సవిత

సత్యసాయి: కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నారు. సంపద సృష్టికి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

May 1, 2025 / 01:07 PM IST

‘పెన్షన్లను సద్వినియోగం చేసుకోండి’

BPT: బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని భీమావారి పాలెంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. భీమావారి పాలెంలోని వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

May 1, 2025 / 12:40 PM IST

కొత్తకోటలో పెన్షన్లు పంపిణీ

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం కొత్తకోటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇంఛార్జ్, ఐఏఎస్ అధికారి ఎం.టీ.కష్ణబాబు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్, తదితద అధికారులు పాల్గొని పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా నగదు పంపిణీ చేశారు.

May 1, 2025 / 11:51 AM IST

కుట్టుమిషన్ శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు

ప్రకాశం: కుట్టుమిషన్ శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీడప్ స్కిల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ ఉపాధి అవకాశాల పోస్టర్‌ను గురువారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి, వారికి మిషన్లను కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు.

May 1, 2025 / 11:49 AM IST

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్

ELR:పెదపాడు మండలం వట్లూరు, శౌరిపురం గ్రామాలలో గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి, ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి అమ్రపాలి పర్యటించారు. ఈ సందర్భంగా వారితో కలిసి అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

May 1, 2025 / 11:17 AM IST

ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు దీపిక

Akp: దక్షిణ కొరియాలో జులై 20 నుంచి 30వరకు జరిగే 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌కు నర్సీపట్నంకు చెందిన పెదిరెడ్ల చైత్యదీపిక ఎంపికైంది. గత నెల 15 నుంచి 30 వరకు పంజాబ్ మొహాలిలో జరిగిన భారత ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ జట్టు ఎంపిక పోటీలో దీపిక యూత్ కేటగిరి పెయిర్ స్కేటింగ్‌లో పాల్గొని ప్రతిభ చాటి భారత్ జట్టులో స్థానం సాధించింది.

May 1, 2025 / 11:08 AM IST

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే పెన్షన్లు అందుకున్న అవ్వ, తాతల ముఖంలో ఆనందం వెలకట్టలేనిది అన్నారు. కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

May 1, 2025 / 10:51 AM IST

మోదీ సభకు ఉచిత బస్సులు: ఎమ్మెల్యే

KDP: అమరావతిలో శుక్రవారం జరిగే ప్రధాని మోదీ సభకు వెళ్లేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. బస్సుల్లో వెళ్లే వారికి భోజనం సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

May 1, 2025 / 10:31 AM IST

చక్రాయపేటలో పర్యటించిన ఎంపీ అవినాష్

KDP: చక్రాయపేటలో గురువారం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. కుప్పం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇటీవల గాయపడిన వైసీపీ నేత రాంబాబును పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సురభి గ్రామ సర్పంచ్ బోయిన రవణమ్మను పరామర్శించారు.

May 1, 2025 / 10:26 AM IST

విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేత

పశ్చిమగోదావరి: యర్నగూడెం శాఖ గ్రంథాలయంలో నిర్వహిసున్న వేసవి విజ్ఞాన శిబిరానికి బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 1, 2025 / 10:24 AM IST

‘మేడే స్పూర్తితో పోరాటాలు కొనసాగించాలి’

KDP: మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించాలని సీఐటీయూ మైలవరం మండల కన్వీనర్ ఏ. వినయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా మైలవరంలో ఆటోస్టాండ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉన్న సీఐటీయూ స్తూపాలను మైలవరం ఆటో స్టాండ్ కార్యదర్శి గైబూసా(నన్నే), వినయ్ కుమార్‌లు ఆవిష్కరించారు.

May 1, 2025 / 10:15 AM IST

రూ.15లక్షల నిధులతో సీసీ కెమెరాలు

PLD: వినుకొండలోని ప్రధాన రహదారుల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో అధారాలు సేకరణ కోసం పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలిస్ శాఖ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో పట్టణంలో కెమెరాల ఏర్పాటు నిమిత్తం రూ.15లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

May 1, 2025 / 10:10 AM IST

ఇబ్రహీంపట్నంలో ఘనంగా మే డే వేడుకలు

NTR: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని కార్మిక సోదరులు ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మే డే అని అన్నారు.

May 1, 2025 / 10:04 AM IST

షార్ట్ సర్క్యూట్ కావడంతో కాలిపోయిన గృహోపకరణాలు

ASR: కొయ్యూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రాజేంద్రపాలెంలో విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పలువురి గ్రామస్తులకు చెందిన ఇన్వర్టర్లు, కూలర్లు, గ్రైండర్లు, బల్బులు, టీవీలు, ఫ్యాన్లు తదితర విద్యుత్ ఆధారిత గృహోపకరణాలు, సామాగ్రి కాలిపోయాయని బాధితులు గురువారం ఉదయం తెలిపారు.

May 1, 2025 / 08:16 AM IST