BPT: వేమూరు నియోజకవర్గ పరిధిలో పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రగతిపై వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మంజూరైన పనులు ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభించాలని సూచించారు.
KKD: ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ మెడికల్ కాలేజీ సీట్లుపై అనేక మాటలు చెప్పారని, నేడు అధికారంలోకి రాగానే మొత్తం మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. గురువారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
KDP: బద్వేల్ గోపవరం గ్రామానికి చెందిన మిరియం శ్రీనాథ్ అనే విద్యార్థి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు గోపిరెడ్డి హైస్కూల్ నుంచి ఇంటికి బయలుదేరిన తర్వాత అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ తెలియడం లేదు. ఎవరికైనా అతని ఆచూకీ తెలిస్తే 91 95159 57580 నంబర్కు సమాచారం అందించాలని కుటుంబసభ్యులు కోరుచున్నారు.
ప్రకాశం: ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఇవాళ మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పేదలకు వైద్యం దూరమవుతుందని, అలాగే పేద విద్యార్థులు వైద్య విద్య అందని ద్రాక్షలా మిగిలిపోతుందన్నారు.
KDP: చాపాడు మండలంలోని తప్పెట ఓబయపల్లెకి చెందిన లక్ష్మయ్య (54) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. కొన్నేల్లుగా కుటుంబ సమస్యలతోపాటు మద్యానికి బానిసై అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలియాజేశారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చెసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
WG: ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. గురువారం 19వ వార్డు మారుతీ స్వామి ఆలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సేవల ద్వారా ఆరోగ్యం పెంచుకోవాలన్నారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు ఛైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యం ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు.
SKLM: మెలియాపుట్టి మండలం కరజాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో నేటి నుండి 24వ తేదీ వరకు విద్యాశాఖ పిలుపు మేరకు వినియోగదారుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వినియోగదారుల క్లబ్ మాస్టర్ ట్రైనర్ ఎల్.వెంకటాచలం తెలిపారు. గురువారం విద్యార్థులచే వినియోగదారుల భాగస్వామ్యం గురించి వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. క్లబ్బు విద్యార్థులకు ఎగ్జామ్ రమణమూర్తి టీ షర్టులు అందజేశారు.
VZM: బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఇవాళ ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీ నాయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలుచేశారో అని అడుగగా, 30% పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా 80-90% కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.
VSP: ఉత్తరాంధ్ర తారాగణంతో రూపొందిన ‘ఎవడి సినిమాకు వాడే హీరో’ చిత్రం విజయవంతంగా ఆరు రోజుల పాటు జగదాంబ శారద థియేటర్లో ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా గురువారం థియేటర్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. పరిమిత బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందిందని చిత్ర బృందం తెలిపింది.
E.G: ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్తో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్లో గురువారం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల మండలంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ఎంపీతో సుదీర్ఘంగా చర్చించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అట్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు పాపుదిప్పు మల్లికార్జున్ రెడ్డి, మండల కార్యదర్శి బోవిళ్ల సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక బద్వేల్ ప్రాంతంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
సత్యసాయి: ధర్మవరంలో అంగన్వాడీలకు ఇవాళ 5జీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొని 230 మంది కార్యకర్తలు, 8 మంది సూపర్వైజర్లకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ ఫోన్లను అందజేస్తోందన్నారు.
E.G: గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయికి చేర్చడమే ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ లక్ష్యమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఉనగట్ల ZPHSలో ఈ క్రీడా సంబరాలను ఆయన ప్రారంభించారు. క్రీడలు శారీరక దార్థ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అనంతరం పరుగు పందెం విజేతలకు బహుమతులు అందజేశారు.
GNTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. పాతగుంటూరు, అలీనగర్, మారుతీనగర్ ప్రాంతాల్లో గురువారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలో సమస్యలను విస్మరించిందని విమర్శించారు.
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనీన(RIMS) ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కె. హరిబాబు గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత రికార్డ్లను పరిశీలించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకు అధికంగా అవగాహన కల్పించి వారికి ప్రభుత్వం కల్పించిన చట్టాలపై మరింతగా బోధించాలన్నారు.