VZM : జిల్లాలో నిర్వహిస్తున్న బోద వ్యాధి నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. గుర్లలో ఇప్పటివరకు 5,516 మందికి మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు.