KRNL: జొన్నగిరి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా సి.మల్లికార్జున బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ జయశేఖర్ ఆదోని త్రీ టౌన్ పోలీసు స్టేషన్కు బదిలీపై వెళ్లారు.
కర్నూలు: వెల్దుర్తి, క్రిష్ణగిరి అంగన్వాడీ టీచర్స్ బుధవారం సీడీపీవో లుక్కు పని ఒత్తిడి తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. బాల సంజీవని 2.0 కొత్త వర్షన్ నిబంధనలను అంగన్వాడీ యూనియన్లు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు అమలు చేయవలసిన పనులు అంగన్వాడీ సిబ్బందికి చెప్పడం పని ఒత్తిడి అవుతుందని తెలిపారు.
కర్నూలు: ఆదోని పట్టణంలో బుధవారం బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రెసిడెంట్గా వీ.శ్రీరాములు 101 మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్గా జే వెంకటేశులు 186 మెజారిటీతో అలాగే జనరల్ సెక్రటరీ ఎల్ కె జీవన్ సింగ్ 109 మెజారిటీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా పి రాజారత్నం 49 మెజారిటీతో ప్రత్యర్థులపై గెలుపొందారు. గెలుపొందిన వారికి బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.
VZM: తెర్లాం మండలంలో సింగిరెడ్డివలస రెవిన్యూ పరిధిలో తోటపల్లి కాలువ నిర్మాణం చేపడితే పలు గ్రామాలకు సంబంధించి సుమారు 1500 – 2000 ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం కల్పించవచ్చని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ ప్రాంతాలను పరిశీలించి, ఇరిగేషన్ మంత్రికి తోటపల్లి కాలువ నిర్మాణ ఆవశ్యకతను వివరించి వీలైనంత త్వరగా మంజూరు చేసేలా ప్రయత్నిస్తానన్నారు.
GNTR: గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో శాసనమండలి ఛైర్మన్ ఆలపాటి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తదితర నేతలు రాజేంద్రప్రసాద్ని అభినందించారు. పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆలపాటి వెల్లడించారు.
NLR: జలదంకి మండలం కృష్ణంపాడులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ సుంకర శ్రీనివాసులు సూచనల మేరకు ఎస్సై దేవిక సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న గోని అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
PPM: ఎమ్మెల్యే విజయ్ చంద్రతో రాష్ట్ర ఎంఈవో అసోషియేషన్ అధ్యక్షులు సాముల సింహాచలం బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవోలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, విద్యాశాఖ మంత్రి దృట్టికి తీసుకు వెళ్తానని హమీ ఇచ్చారు.
ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతి ప్రోగ్రాంకు 108మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఏపీవో టీ.అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్, చింతపల్లి ఏపీడీ లాలం సీతయ్య పాల్గొని, మండలానికి చెందిన 10వ తరగతి పాసైన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ELR: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ప.గో.జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ బుధవారం ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గల పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ నుంచి విడుదల చేసిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
SKLM: విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదవతరగతి పరీక్షలు వ్రాసి రిలీవ్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
CTR: వర్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టగా ఆయన మాట్లాడారు. మైనారిటీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుదని చెప్పారు. వక్స్ ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పారు.
GNTR: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళలపై నేరాల నియంత్రణ కోసం ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వసతీ గృహాల స్వాగత ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
CTR: పూతలపట్టు భవిత కేంద్రంలో ఆటిజం అవగాహన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఈవోలు వాసుదేవన్, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. బుద్ధి మాంధ్యం పిల్లలతో తల్లితండ్రులు ఎక్కువ సమయం గడపాలన్నారు. వారిని ఏకాంతంలో వదలకుండా నలుగురిలో కలిసేలా చూడాలని సూచించారు. తద్వారా వారిలో మానసిక బుద్ధి వికాసం ఏర్పడి, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు.
CTR: వెదురుకుప్పం మండలం చవటగుంట వద్ద ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రయాణికులు, ప్రజల దాహాన్ని తీర్చడానికి పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.