• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్సు

గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు బయలుదేరుతుంది.

February 9, 2025 / 08:39 AM IST

ప్రముఖ గాయని కోటిరాజ్ మృతి

బాపట్ల: మండలం నరసాయపాలేనికి చెందిన ప్రముఖ గాయని కారుమంచి కోటిరాజ్(88) శనివారం మృతి చెందారు. ఈమె సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈమె ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆమె పలు సినిమాలకు పాటలు కూడా పాడారు. బాపట్ల జమేదారుపేటలో సప్తస్వర సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు.

February 9, 2025 / 08:30 AM IST

తిరుపతమ్మ తిరునాళ్ల ఏర్పాట్ల పరిశీలన

NTR: ఈనెల 11నుంచి జరిగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సత్కరించి చిత్రపటం అందజేశారు.

February 9, 2025 / 08:22 AM IST

గరుడ వాహనంపై శ్రీవారి ఊరేగింపు

E.G: కడియం మండలం దుళ్లలో గల శ్రీదేవి, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంబరాన్నంటాయి. శ్రీవారికి ప్రీతికరమైన గరుడ వాహనంపై దుళ్ల గ్రామ వీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు, ఉప సర్పంచ్ టి.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

February 9, 2025 / 08:09 AM IST

భక్తులతో సందడిగా మారిన శ్రీమఠం

KRNL: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో శనివారం సందడిగా మారింది.సెలవు దినం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం, మహాముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నది తీరాలు భక్తులతో భరితమయ్యాయి. వారు పుణ్యస్నానాలు చేసి మంచాలమ్మను దర్శించి స్వామి బృందావనంలో పూజలు చేశారు.

February 9, 2025 / 07:51 AM IST

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు విద్యార్థినులు ఎంపిక

కృష్ణా: ముసునూరు మండలం రమణక్కపేట విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్టు నుంచి ఎంపికైనట్లు పీడీ డాక్టర్ వాకా నాగరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రమణక్కపేట జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థినులు టి. నాగసుధ, డి. భార్గవిలు ఎంపికైనట్లు చెప్పారు. పిఠాపురంలో ఏపీ అండర్-16 రాష్ట్రస్థాయి యూత్ పోటీలు ఈనెల 11న జరుగుతున్నాయని అన్నారు.

February 9, 2025 / 07:37 AM IST

సీఐ అసభ్య ప్రవర్తన.. విచారణకు ఆదేశం

సత్యసాయి: మడకశిర సీఐ రాగిరి రామయ్య తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని గాయత్రి అనే మహిళ జిల్లా SP రత్నకు ఫిర్యాదు చేశారు. బంధువులతో జరిగిన గొడవ విషయంలో స్టేషన్‌కు వెళ్లగా సీఐ తనను గదిలోకి పిలిపించి మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అంటూ అసభ్యంగా మాట్లాడారని వాపోయారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.

February 9, 2025 / 07:30 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ పరికరాల ప్రారంభం

KRNL: పత్తికొండలోని మండగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే శ్యాంబాబు ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. 1950లో ప్రారంభమై 75 సంవత్సరాల తర్వాత సిజేరియన్ కాన్పు పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వైద్యుల విజ్ఞప్తి మేరకు ఆయన ఏర్పాటు చేయించారు. అగ్రహారంకు చెందిన పద్మకు మొదటి సిజేరియన్ చేయగా సక్సెస్ అయ్యింది ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పనులు నిలిచిపోయాయని తెలిపారు.

February 9, 2025 / 07:24 AM IST

చిలకలడోనలో నిల్వ చేసిన గడ్డివాము దగ్ధం

KRNL: మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామంలో శనివారం గడ్డివాము దగ్ధమైంది. మాజీ MPTC డీపీ గోవిందమ్మ, రాఘవేంద్ర గ్రామ శివారులో పశుగ్రాసం నిల్వ చేసిన గడ్డివాములో మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి, నీటిట్యాంకర్లు, JCB యంత్రాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది.1.5 లక్షల నష్టం జరిగిందన్నారు.

February 9, 2025 / 07:22 AM IST

గుణదల పార్కింగ్ స్థలాలు

కృష్ణా: విజయవాడ గుణదల ఉత్సవాల సందర్భంగా పార్కింగ్ స్థలాలను పోలీసులు తెలిపారు. విజయవాడ సిటీ, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి BRTS ROADలో, గన్నవరం, మచిలీపట్నం, ఏలూరు, పడమట వైపు నుంచి వచ్చే వారికి జీఎన్ బైబిల్ కాలేజ్ మైదానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, ESI హాస్పిటల్ మైదానం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

February 9, 2025 / 07:11 AM IST

ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్డులో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు శనివారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ప్రేమ, శాంతి, కరుణ, క్షమాపణ, తదితర ఉత్తమ గుణాలను ప్రతి ఒక్కరూ పెంపొందించేందుకు ఈ మహోత్సవాలు దోహదపడతాయని అన్నారు.

February 9, 2025 / 07:10 AM IST

మందకృష్ణ మాదిగను కలిసిన కె.ఎస్.జవహర్

E.G: పద్మశ్రీ అవార్డు పొందిన మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ శనివారం హైదరాబాద్‌లో రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మందకృష్ణ మాదిగతో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై జవహర్ చర్చించటం జరిగింది.

February 9, 2025 / 06:31 AM IST

‘PGRS కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోండి’

NDL: అవుకు మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నంద్యాల కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశాల మేరకు ఈనెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

February 9, 2025 / 04:51 AM IST

మారుమూల గ్రామాలకు రహదారి నిర్మాణం

ASR: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని టీడీపీ కొయ్యూరు మండల కార్యదర్శి దొరబాబు అన్నారు. శనివారం ఆయన కన్నవరం గ్రామంలో పర్యటించారు. కన్నవరం నుంచి వంతమర్రి, పిట్టలపాడు, గరిమండ వరకూ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే మారుమూల గ్రామాలకు రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు.

February 8, 2025 / 08:16 PM IST

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

ASR: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం పాడేరులో ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్-2 వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని తెలిపారు.

February 8, 2025 / 07:38 PM IST