ASR: పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ పార్టీ గుర్తింపునిస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శనివారం హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన వైసీపీ పార్టీ మండల అధ్యక్షులను సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
ASR: గసబ పంచాయితీ మొర్రిగూడ గ్రామంలో రచ్చబండ నిర్మాణంకు గ్రామ పెద్దలు పాంగి అగడ, వంతాల మొస్య శనివారం శంకుస్ధాపన చేశారు. ఈ రచ్చబండ కు 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రూ.2లక్షలు మంజూరు అయినట్లు వార్డ్ సభ్యులు పీ.సత్యన్నారాయణ తెలిపారు. గ్రామ సమస్యలు చర్చించు కోవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి రచ్చబండ ఉపయోగంగా ఉంటుందని మాజీ సర్పంచ్ సురేష్ అన్నారు
VSP: గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాతవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్లు ప్రమాదాల నివారణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
అల్లూరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 11,12 తేదీల్లో జరిగే మన్యం బంద్కు తగిన కార్యచరణ ఈ సమావేశంలో రూపొందించారు. ఈ బంద్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయలని కోరారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ పార్టీ, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.
VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి శనివారం విచ్చేసిన మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ను సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. మంత్రి తో పాటు ఏస్ కోట ఎమ్మెల్యే కూడా మాజీ ఉప రాష్ట్రపతిని కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.
SKLM: జలుమూరు మండలం సురవరంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై పి అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటరమణ అనే వ్యక్తి 72 మద్యం సీసాలతో సురవరం గ్రామానికి వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. తక్షణం నిందితుడుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
పల్నాడు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
SKLM: కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు గ్రామ దేవత సింధుపోలమ్మ గుడి రోడ్డులో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి శనివారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని మండల టీడీపీ కార్యదర్శి మాదిన రామారావు అన్నారు.
SRKL: సోంపేట మండలం బేసి రామచంద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఓ లారి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
E.G: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. ఇండియా కూటమి ‘ఇగో’లకు పొతే ఎలక్షన్ ఫలితాలు ఇలానే ఉంటాయన్నారు. ఈ ఓటమికి కారణం కేజ్రీవాల్ 80%, రాహుల్ గాంధీ 20% కారణమని అన్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఇండియా కూటమిలోని పార్టీలన్ని ఒకసారి కూర్చొని మేధోమధనం చేసుకోవాలని సూచించారు.
NTR: గంపలగూడెం మండలం కొణిజెర్లకు చెందిన నంబూరు వరుణ్కు అమెరికా అమ్మాయితో వివాహమైంది. వరుణ్ USAలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో షర్లెట్కు చెందిన ఎరికాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లిగా మారింది. ఇరు కుటుంబాల సమక్షంలో శుక్రవారం రాత్రి కొణిజెర్లలో వివాహం చేసుకున్నారు. నూతన వధూవరులను కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసిన శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు శనివారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
ASR: ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పాఠశాలలను నిర్వహించాలని సామాజక తనిఖీ ఎస్ఆర్పీ వెంకటరమణ సూచించారు. జీ.మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సామాజక తనిఖీ నిర్వహించారు. పాఠశాల నిర్వహణ వివరాలను సేకరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.
SKLM: కాజీపేట లో జరిగిన కొట్లాట కేసు విషయంలో పొందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్లను ఎస్పీ మహేశ్వర రెడ్డి సస్పెండ్ చేశారు. మూడు రోజుల కిందట గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కొట్లాట జరగటానికి కానిస్టేబుళ్ల నిర్లక్ష్యమే కారణమని నిర్ధారిస్తూ ఎస్పీ వారిని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు.
SKLM: శాలిహుండం లక్ష్మీనరసింహ స్వామి యాత్ర సందర్భంగా వంశ ధార నదిలో శనివారం ఉదయం నుంచి చక్రతీర్ధ స్నానం, కొండపైన దర్శనాలు ఉండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.