కృష్ణా: ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఓఎన్జీసీ సంస్థ సభ్యులు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి ఎక్కవగా ఉండటంతో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని సభ్యులు తెలిపారు.
కృష్ణా: విజయవాడ ఆటోనగర్లో మంగళవారం రాత్రి లక్ష్మీ అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ పడి ఉన్న ప్రాంతాన్ని ఏసీపీలు పవన్ కిషోర్, దామోదర్ పరిశీలించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. భర్త మహంకాళి పరారీలో ఉన్నట్టు చెప్పారు.
KKD: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరిలో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
KKD: ఎవరైనా సరే గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో రిప్ రాప్ తిరుగుతున్న 9 మందిని పోలీసులు పట్టుకొని బుధవారం జగ్గంపేట సర్కిల్ ఆఫీసుకి తరలించారు. వారికి జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
E.G: రాజమహేంద్రవరం కార్పొరేషన్ పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పై వేసే పన్నులతో పాటు ఇతర పన్నులతో కలిసి రూ.65.19 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. చివరి రోజున హౌస్ ట్యాక్స్ రూ.2.19 కోట్లు, ఖాళీ స్థలాల పన్నులు రూ.44.87లక్షలు, వాటర్ ఛార్జిలు రూ.24 లక్షలు వసూలయ్యయి.
KKD: ఏప్రిల్ 4వ తేదీన కరప గ్రామ పంచాయతీ వద్ద దివ్యాంగులకు రాయితీతో కూడిన ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేస్తామని కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యులు జారీ చేసిన సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు,100 రూపాయలుతో దివ్యాంగులు నాలుగో తేదీ ఉదయం పంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ బస్సు పాస్కు 3సంవత్సరాల కాలపరిమితి కలదు.
E.G: రాజానగరం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. సీతానగరం నుంచి పురుషోత్తపట్నం వరకు రోడ్డు వేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
NLR: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ను నియమిస్తూ గవర్నర్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల పాటు కొత్త ఛైర్మన్ నియామకం అయ్యేంత వరకు శశిధర్ ఈ పదవిలో కొనసాగునున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని హెచ్చరించింది.
NLR: జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటితొట్లు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు డ్వామా పీడీ గంగాభవానీ తెలిపారు. మనుబోలులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి ఆమె మాట్లాడారు. 964 నీటి తొట్టెల నిర్మాణాలకి రూ. 2.58 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.30 వేలు అందిస్తామన్నారు.
E.G: రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన ఓ యువతి (22) అదృశ్యమైంది. మార్చి నెల 20 తేదీ నుంచి ఆ యువతి ఆచూకీ కోసం తల్లి ఎంత ప్రయత్నించినా కనిపించలేదు. దీంతో తల్లి మంగళవారం బొమ్మూరు స్టేషన్ను ఆశ్రయించింది. ఆ తల్లి ఫిర్యాదు మేరకు బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
VSP: ప్రపంచమంతా జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ ఫొటోలను AI ఇమేజ్లుగా మార్చుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ అందాలను సైతం కొందరు జీబ్లీ ఇమేజ్లుగా మార్చారు. విశాఖలోని మెయిన్ సెంటర్స్, సింహాచలం దేవస్థానం, ఏయూ, బీచ్ రోడ్డు, కైలాసగిరి విజువల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రకాశం: ఉపాధి హామీ 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను సంతమాగులూరులో బుధవారం నిర్వహిస్తున్నట్లు ఏపీఓ బాలకృష్ణనాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభంకానున్న ప్రజావేదికలో పాల్గొనాలని ఆయన కోరారు