ప్రకాశం: కంభం మండలంలో బుధవారం ఉరుములు, మెరుపులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని హజరత్ గూడెంలో వెంకటేశ్వర్లు అనే రైతుకు సంబంధించిన రెండు గేదెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ.1,40,000 నష్టం వాటిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని స్థానిక రైతు వాపోయాడు.
PPM: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచనల మేరకు జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, గాలులు 60 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసిందన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
W.G: సింహాచలం దుర్ఘటనలో మృతి చెందిన బాధితులకు కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు రూ.25 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరారు. బుధవారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆలయ ఈవో, కాంట్రాక్టర్ పై చేతనం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురుపూజ ఆరాధన మహోత్సవాలు మే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 7వ తేదీ వైశాఖ శుద్ధ దశమి స్వామివారి సజీవ సమాధి వహించిన పవిత్ర దినం, 8వ తేదీ మహా రథం, 9వ తేదీ మహా ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
PPM: మహిళలు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బుధవారం పార్వతీపురంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు పలు సూచనలు, సలహాలు అందించారు.
KDP: సిద్ధవటం మెజిస్ట్రేట్ కోర్టు ఏజీపీగా ఒంటిమిట్టకు చెందిన ఆదినారాయణ నియమితులయ్యారు. సిద్ధవటం, కడప తదితర ప్రాంతాల కోర్టులో 12 ఏళ్లుగా న్యాయవాదిగా గుర్తింపు పొందారు. కాగా ఒంటిమిట్టలో కొన్నేళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు న్యాయవాదిగా చేసిన సేవలను గుర్తించి తమకు ఏజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
PLD: చిలకలూరిపేట రూరల్ ఈవూరివారిపాలెం గ్రామంలో శ్రీఅభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణంలో కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
BPT: 2023 జూన్లో చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామానికి చెందిన మైనర్ యువకుడు ఉప్పాల అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి దహనం చేసిన హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు న్యాయపరంగా వేగవంతం చేయాలనే ఉద్దేశంతో వినుకొండకు చెందిన హైకోర్టు న్యాయవాది కావూరు గోపీనాథ్ను ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం బుధవారం నియమించింది.
NLR: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతిచెందిన ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మంత్రి హమీ ఇచ్చారు.
NLR: కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు మూడు నెలల జీతాం బకాయి ఉన్నాయని చెప్పారు. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడున్నరేళ్లుగా పీఎఫ్ కూడా జమ చేయలేదని కార్మికులు వాపోయారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
CTR: జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. ఈ నెల 4న తొలుత జిల్లా కేంద్రంలోని ఆర్వో(అర్బన్) కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. ఈ నెల 30 నుంచి మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామన్నారు.
NLR: ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతున్నట్టు ఆ ప్రాజెక్టు ఇంజినీర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 1వ యూనిట్లో 460, 2వ యూనిట్లో 565, 3వ యూనిట్లో 630 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
ATP: గుత్తిలో బుధవారం పొట్టి శ్రీరాములు పార్క్ను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి మనోజ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శబరి పొట్టి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పార్క్ను ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈ పార్కును పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: ప్రైవేట్ ట్రావెల్స్ తీరుతో ఉదయగిరి వాసులు ఇబ్బంది పడ్డారు. 30మంది ప్రయాణికులతో రాత్రి హైదరాబాద్ నుంచి ఓ బస్సు ఉదయగిరి బయల్దేరింది. మార్గమధ్యలో నాగార్జునసాగర్ వద్ద రాత్రి 2గంటల సమయంలో పొగలు రావడంతో బస్సును నిలిపివేశారు. మరో వాహనం ఏర్పాటు చేయకుండా బస్ డ్రైవర్ సమీప ప్రాంతంలో మద్యం తాగుతూ తమను పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు.
నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో ఈ నెల 9న పామూరు ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ వాసు అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసి డంపింగ్ యార్డ్లో పడేశారు. ఈ కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ వాసు హత్య కేసులో 9మంది నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ స్టేషన్కు తరలించారు.