కోనసీమ: ఆత్రేయపురం(M) వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటులు తనికెళ్ళ భరణి, గౌతం రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు క్రితం ఇక్కడికి రావడం జరిగిందని, అప్పుడు సాధారణ జనం, ఇప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. మరో తిరుమలగా రోజూ రోజుకు అభివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉందన్నారు.
ELR: చాట్రాయి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి పార్థసారథికి వినతి పత్రం సమర్పించారు. ఇవాళ చాట్రాయిలో మంత్రిని టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస్ కలిశారు. సుమారు 12 వేల ఎకరాల్లో పంట సాగులో ఉందని, త్వరగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ఇవాళ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కడప వైపు వెళ్తున్న లారీ మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ చెట్టుని ఢీకొని రోడ్డుకు అడ్డుగా ఉండటంతో కొంతమేర ట్రాఫిక్ జామైంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
WG: నరసాపురం మండలం లిఖితపూడిలో ఇవాళ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని మొత్తం 186 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ ఐ.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KRNL: పేద కుటుంబాలకు CMRF పథకం భరోసాగా నిలుస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇశాళ కౌతాళం గ్రామానికి చెందిన పరిమళ బాయికి రూ.1,48,847, కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన బలరాముడుకు రూ.75,122 సీఏం సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయాన్ని పంచలింగాలలోని తన స్వగృహంలో ఎంపీ అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అన్నారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. లేపాక్షి మండల అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాన్ని ఎస్సై నరేంద్ర బృందం డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించింది. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ATP: కొండూపల్లిలో గతంలో కురిసిన వడగళ్ల వానకు గొర్రెలు కోల్పోయిన 15 మంది రైతులకు ప్రభుత్వం రూ. 7,14,000 నష్టపరిహారం మంజూరు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కాపరుల కష్టాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. 238 గొర్రెలు మరణించగా బాధిత కుటుంబాలకు ఈ సాయం అందింది.
KKD: ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: పత్తికొండలో కౌలు రైతును ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదోని రోడ్డులోని కౌలు రైతు పక్కీరప్పకు చెందిన రూ 5 లక్షలు విలువ చేసే పశుగ్రాశం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న రామచంద్రయ్య ఇవాళ కౌలు రైతును పరామర్శించారు.
VZM: బొండపల్లి మండలం దేవుపల్లిలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్’ ఏర్పాటుతో జిల్లా దశ మారుతుందన్నారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 23న ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
E.G: గోకవరం మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో దాళ్వా వరి పంటకు మాగుడు, మానిపండు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని మండల వ్యవసాయాధికారి పీ. రాజేశ్వరి హెచ్చరించారు. గింజ పాలు పోసుకునే దశలో ధాన్యం రంగు మారకుండా ఉండాలంటే, నివారణకు ఎకరానికి 200 మి.లీ. ప్రాపిక్రోనజోల్ పిచికారీ చేయాలని ఆమె సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాలని కోరారు.
కోనసీమ: అమలాపురం(మం) కామనగరువు గ్రామ శివార్లలో పేకాట శిబిరంపై రూరల్ ఎస్సై శేఖర్ బాబు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జూదగాళ్ళను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 52 పేకాట కార్డులతో పాటు రూ. 4,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని తేల్చి చెప్పారు.
TPT: ఈనెల 30న చంద్రబాబు నాయుడుపేట పర్యటన ఖరారు అయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ టూర్ను ఈసారి ఫైనల్ చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు, కో-ఆర్డినేటర్ బృందం సమీక్షిస్తున్నాయి. పూదూరు సమీపంలోని టిడ్కో గృహ సముదాయం, ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
VSP: వైసీపీ ఎస్సీ విభాగ పరిశీలకురాలిగా గండి భాగ్యవతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు కేకే రాజును కలిశారు. ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి వార్డు, సచివాలయం స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలని కేకే రాజు ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
NTR: చందర్లపాడు మండలం కోనయాపాలెం సొసైటీలో రైతుల అభివృద్ధి, వ్యవసాయ బలోపేతానికి పెద్దపీట వేస్తూ రూ.1.30 కోట్ల రుణ పంపిణీ చెక్కులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు పంపిణీ చేశారు. రైతే దేశానికి వెన్నెముక అని, రైతు అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని కోరారు.