కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు గ్రామ పెద్దలతో కలిసి సోమవారం తాలూకా ఎస్సై శేఖర్ బాబు శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన సోమవారం గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఇచ్చిన వ్యవది లోపే వాటిని తొలగించాలని ఎస్సై సూచించారు.