ASR: డుంబ్రిగుడ మండలంలోని కించుమండ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. పూర్తిస్థాయి ప్రహరీ లేకపోవడంతో బయట వ్యక్తులు, మూగజీవాలు లోపలకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు.