KDP: మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని దువ్వూరు మండల వైసీపీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పార్టీ పరిస్థితులను శంకర్ రెడ్డి వివరించారు. కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.