• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

BPT: బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2025 / 07:01 AM IST

పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

PLD: క్రోసూరు మండలంలోని ఉయ్యందన గ్రామంలో శ్రీలక్ష్మి అనే మహిళ తమ్మిశెట్టి చిరంజీవిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో ఈ దాడి చేసినట్లు యువతి స్థానికులకు తెలిపింది. కాగా క్షతగాత్రుడిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2025 / 06:51 AM IST

బొబ్బిలి సీఐను అభినందించిన ఎస్పీ

VZM: గంజాయి కేసును ఛేదించినందుకు గాను బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావును ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఫిబ్రవరి 10న కారులో తరలిస్తున్న గంజాయిని రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్ట్ వద్ద పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు. ఈ  కేసును సమగ్ర దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో రూరల్ సీఐ నారాయణరావుకు ప్రశంస పత్రం ఇచ్చి ఎస్పీ అభినందించారు.

April 2, 2025 / 06:27 AM IST

అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దుండగులు చోరీ

ATP: గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ నందుగల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఎవరు లేని సమయంలో హుండీ తాళాలు పగలగొట్టి సుమారు రూ. 20,000 నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 1, 2025 / 07:50 PM IST

నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టండి: కలెక్టర్

TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం సమావేశమయ్యారు. నగరంలోని చెరువులలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బన్సల్, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు

April 1, 2025 / 07:28 PM IST

పల్టీలు కొట్టిన కారు.. పలువురికి గాయాలు

NTR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ39 HQ6336 కారుకు బైకు అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ఒకే వైపు వస్తుండగా జరిగినా ఈ ప్రమాదంతో పొదల్లోకి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్ళింది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

April 1, 2025 / 05:17 PM IST

ఈనెల 4న నమోదు చేయించుకోవాలి

ASR: సదరం ధృవపత్రాలు జారీ చేయడం కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కొయ్యూరు ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ధృవపత్రాలు అవసరమైన వవారు ముందుగా స్లాట్లు బుక్ చేసుకోవాలన్నారు. ఈనెల 4న మండలంలోని గ్రామ సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో స్లాట్లు నమోదు చేస్తారన్నారు. ఈమేరకు తమ పరిధిలోని కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.

April 1, 2025 / 05:11 PM IST

బాపట్లలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

BPT: బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు పోలీసులు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించమని హెచ్చరించారు. అనునిత్యం పట్టణంలో పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. 

April 1, 2025 / 04:57 PM IST

సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలి

ELR: ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన విద్యార్హత కలిగిన వారికి వర్క్ ఫ్రమ్ హోం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన సర్వేను యుద్ధప్రాతిపధికన పూర్తిచెయ్యాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో డీఎల్ డీవోలు, ఎంపీడీవోలు క్షేత్రస్ధాయిలో పర్యటించాలన్నారు.

April 1, 2025 / 04:37 PM IST

దారుణం.. 10వ తరగతి బాలికపై లైంగిక దాడి

కడప: పదో తరగతి బాలికపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వాల్మీకిపురంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలో ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పక్క వీధిలో కాపురం ఉంటున్న జేసీబీ డ్రైవర్ బాలికను లోబర్చుకుని లైంగిక దాడి చేశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

April 1, 2025 / 03:30 PM IST

ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మోసం చేశారు

GNTR: ప్రజలకు సుపరిపాలన అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు.

April 1, 2025 / 02:20 PM IST

విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా

చిత్తూరు: నగరి మండలం ఏకాంబర కుప్పం పంచాయతీ పరిధిలోని తరణి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో విచ్చలవిడిగా శ్మశానాలను సైతం తోడేస్తున్నారు. స్థానికులు సమాచారంతో ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 1, 2025 / 01:53 PM IST

ఏప్రిల్ 6న శ్రీవారికి ప్రత్యేక కార్యక్రమాలు

చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రంగనాయకుల మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేకాన్ని జరిపించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

April 1, 2025 / 01:52 PM IST

నీటి కుంటలను ఏర్పాటుకు శంకుస్థాపన

PLD: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా నరసరావుపేట మండలం గురువాయపాలెం గ్రామంలో మంగళవారం పశువుల కోసం నీటి నిల్వల నీటి కుంటలను ఏర్పాటుకు ఎమ్మెల్యే అరవిందబాబు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోడానికి, పశువులకు వేసవికాలంలో దాహం తీర్చడానికి నీటికుంట ఏర్పాటు చేస్తున్నామన్నారు.

April 1, 2025 / 01:48 PM IST

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

TPT: మార్చి 17 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా.. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయి. నాగలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగుకు పాల్పడకుండా సంతోషంగా పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. మంగళవారం చివరి రోజు పరీక్షలు రాసిన విద్యార్థులు కేరింతలతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకొచ్చారు.

April 1, 2025 / 01:37 PM IST