• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేని కలిసిన విశ్రాంతి ఉద్యోగులు

SKLM: కవిటి మండలం రామయ్యపుట్టుగ గ్రామంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును మంగళవారం పలువురు విశ్రాంతి ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్రాంతి ఉద్యోగుల సమావేశ భవనం నిర్మాణంకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు, కౌన్సిలర్ ఆశి లీలారాణి పాల్గొన్నారు.

April 29, 2025 / 08:23 PM IST

గ్రానైట్ వాహనాలు తనిఖీ

ప్రకాశం: సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట మైనింగ్ చెక్ పోస్ట్ వద్ద గ్రానైట్ లోడుతో వెళ్తున్న భారీ లారీలను మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చీమకుర్తి మైనింగ్ నుంచి రామాయపట్నం పోర్టుకు గ్రానైట్ తరలిస్తున్న లారీ డ్రైవర్లను ఆపి సోదాలు చేశారు. మద్యం తాగి ఉన్నారా లేదని పరిశీలించారు. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలని ఆరా తీశారు.

April 29, 2025 / 07:56 PM IST

మాజీ సీఎం జగన్ కలిసిన ఇంఛార్జ్

SKLM: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పేడాడ తిలక్ మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలపై చర్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ కమిటీలు నియామకం పరిస్థితులను వివరించారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకుల పై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను తెలియజేశారు.

April 29, 2025 / 07:52 PM IST

పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు

KDP: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. మంగళవారం కడప నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబరిచిన సీఐ లింగప్ప, ఎస్ఐలు చాంద్ బాషా, శ్రీనివాసులు, మైనుద్దీన్లతో పాటు పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

April 29, 2025 / 07:50 PM IST

మైలవరం నుంచి పెన్నాకి నీరు విడుదల

KDP: మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు 317 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు మైలవరం జలాశ అధికారులు తెలిపారు. నదీ పరివాహ గ్రామాలకు తాగునీటి అవసరార్థం నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మైలవరం జలాశయానికి ఎటువంటి ఇన్ఫ్లో లేదని తెలియజేశారు.

April 29, 2025 / 07:35 PM IST

ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు అభినందించిన MLA

కోనసీమ: ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA బండారు సత్యానందరావు హాజరయ్యారు. మండలంలో 1, 2, 3వ స్థానంతో పాటు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను MLA దుశ్శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

April 29, 2025 / 06:55 PM IST

రైల్వే శాఖ మంత్రిని కలిసిన మంత్రి టీజీ భరత్

KRNL: ఏపి ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి వేగంగా జరిగేందుకు పూర్తిగా సహకరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై భరత్ చర్చించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

April 29, 2025 / 05:04 PM IST

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

KRNL: నందికొట్కూరు పట్టణం ఎఐటీయుసీ కార్యాలయం నందు మంగళవారం ఆటో కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటీయుసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి. రఘురాంమూర్తి మాట్లాడుతూ.. నందికొట్కూరు పట్టణంలో 139వ మే డే సందర్భంగా ఎఐటీయుసీ అనుబంధ ప్రజా సంఘాలకు ఎర్రజెండాను ఎగర వెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.

April 29, 2025 / 04:57 PM IST

ఇన్చార్జి చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్సీ

KRNL: ఆదోని తాత్కాలిక మున్సిపల్ ఛైర్మన్‌గా నియమితులైన మొహమ్మద్ గౌస్‌ను MLC మధుసూదన్ ఇవాళ సన్మానించారు. ఈనెల 16వ తేదీన ఛైర్ పర్సన్ శాంతను YCP సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దించిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత ఛైర్మన్ ఎన్నిక అయ్యేంతవరకు తాత్కాలికంగా వైస్ ఛైర్మన్ ను ఇన్ఛార్జి ఛైర్మన్‌గా ఎన్నుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

April 29, 2025 / 04:54 PM IST

మాజీ సీఎం జగన్‌ను కలిసిన యూత్ లీడర్

ATP: రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి రాయదుర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. వైసీపీ పార్టీ మరింత అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారన్నారు.

April 29, 2025 / 04:51 PM IST

బుచ్చిలో ఓ వ్యక్తి దారుణ హత్య

బుచ్చి మండలం నాయగుంట గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన రఫీ ఈ ఘటనలో మృతి చెందారు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన కొందరు కత్తులతో, కర్రలతో దాడి చేశారని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 29, 2025 / 04:48 PM IST

ధర్మవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం

సత్యసాయి: ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మే 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు నాగేంద్ర కోరారు. మంగళవారం శిబిరానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాలవారు కూడా శిబిరానికి హాజరుకావాలని సూచించారు.

April 29, 2025 / 04:25 PM IST

మేడే ఉత్సావాలకు ప్రతి కార్మికుడు సిద్ధంకావాలి

KRNL: మేడే ఉత్సావాలకు ప్రతి కార్మికుడు సిద్ధంకావాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, AITUC మండల కార్యదర్శి చిన్నరాముడు, ఆటో యునియన్ నాయకులు పిలుపునిచ్చారు. మేడే దినోత్సవం సందర్భంగా కోడుమూరులో ఎద్దుల మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన 100 రెడ్ టీ షర్టులను హమాలీలకు మంగళవారం పంపిణీ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడే రోజుగా జరుపుకుంటామని తెలిపారు.

April 29, 2025 / 04:23 PM IST

గంగమ్మ జాతరకు కలెక్టర్‌కు ఆహ్వానం

TPT: గంగమ్మ ఆలయ అధికారులు మంగళవారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌ను కలిశారు. ఇందులో భాగంగా గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. జాతరకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.

April 29, 2025 / 04:14 PM IST

సత్యనారాయణ బీజేపీ బలోపేతానికి కృషి చేశారు: మంత్రి

సత్యసాయి: రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సహచర నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశాబ్దాలుగా బీజేపీ విస్తరణకు సత్యనారాయణ ఎంతో కృషి చేశారని మంత్రి కొనియాడారు.

April 29, 2025 / 04:10 PM IST