KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో గో సంరక్షణ కొరకు డోన్ వాస్తవ్యులైన లక్ష్మీనారాయణ గుప్తా అండ్ నిర్మల రూ. 50,000 మంగళవారం విరాళంగా అందజేశారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్ అందజేసి పూలమాలతో సత్కరించారు.
KDP: మైలవరం మండల పరిధిలోని వద్దిరాల సుంకులమ్మ పరంజ్యోతి అమ్మవారి మహోత్సవం సందర్భంగా వృషభ రాజుల బండలాగుడు పోటీలను జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఉగాది తిరుణాల సందర్భంగా బండలాగుడు పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి వృషభరాజ్యంలో పోటీలలో పాల్గొన్నాయి.
E.G: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ ఆర్.శ్యామల రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెను మంగళవారం స్థానిక మంజీరా హోటల్లో మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆమెను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వారు పార్టీ పరిస్థితులపై చర్చించారు.
PLD: నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడుకు చెందిన రైతు మీసాల నాగేశ్వరరావు తన మిర్చి పంటను కల్లంలో అరబెట్టాడు. గుర్తుతెలియని దుండగులు సుమారు 15 క్వింటాళ్ల మిర్చి చోరీకి పాల్పడ్డారని మంగళవారం తెలిపాడు. ఆరుగాలం కష్ట పడి పంట పండించి కల్లాలలో ఆరబెడితే దొంగలు అపహరించుకు పోతున్నారని వాపోయాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు మంత్రి స్వామి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజమే కూటమీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: బైక్లు వేగంగా నడపొద్దు అన్నందుకు వ్యక్తిపై దాడి చేసిన ఘటన కనిగిరిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి టకారిపాలెం ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తనపై దాడి చేశారని షేక్ కాసిం అనే వ్యక్తి ఆరోపించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: మున్సిపల్ అధికారులు చేపట్టిన పన్ను వసూలు చర్యలకు స్పందిస్తూ నగర ప్రజలు రూ.71.47 కోట్ల పన్నులు చెల్లించారు. సోమవారం ఈ సందర్భంగా నగరపాలక మేనేజర్ N.చిన్నరాముడు,RO ఇజ్రాయేలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పన్ను వసూలు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లను పరిశీలించిన వారు, ఖాళీ స్థలాల పన్నులు వసూలు కావడం నగరపాలక యంత్రాంగానికి ఉత్సాహాన్నిచ్చిందన్నారు.
KRNL: నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని సొంతం చేసుకొని, బ్యాంకును మోసం చేసిన 3వ్యక్తులు, బ్యాంకుCEO సహకారంతో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్నారు. రుణం చెల్లించకుండా దుర్వినియోగం చేసి, ప్రభుత్వ ఉద్యోగులు డాక్యుమెంట్ల పరిశీలన చేయగా, అవి నకిలీగా తేలాయి. ఈ కేసులో చీటింగ్, ఫోర్జరీ వంటి సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నట్లు ఆదోని 1టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపారు.
ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని పన్నుల వసూళ్లలో రికార్డు నెలకొల్పింది. గత ఏడాది మార్చి 31నాటికి వసూళ్ల కంటే అదనంగా రూ.10 కోట్లు సాధించిందని కమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు. సోమవారం అర్థరాత్రి వరకు పెండింగ్ పన్నులను సిబ్బంది కట్టించుకున్నారు. గతేడాది ఆస్తిపన్ను రూ.30.32 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు రూ. 41.04కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.
KRNL: రబీ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కర్నూలు జిల్లాలో 9 మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్లో లో కరువు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జ ఆస్పరి, కల్లూరు, కర్నూలు(R)&(U) మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలను తీవ్ర కరువు ప్రాంతంగా గుర్తించింది. మిగిలిన మండలాలకు చోటు దక్కలేదు.
NDL: కోవెలకుంట్ల మండల పరిధిలోని అమడాలలో ఇవాళ ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి బీసీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన క్యాంప్ కార్యాలయం పిలుపునిచ్చింది.
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6గంటల నాటికి సోమశిల జలాశయంలో 53.269 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 285 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రకాశం: మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో కుక్కలు బెడదతో గ్రామస్తులు భయం భయంతో జీవిస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు మహిళలను వెంటపడి మరీ కరిచాయి. ఎస్సీ పాలెంలో సుమారు 40 కుక్కలకు పైగా వీధుల్లో తిరుగుతూ నిత్యం పొలాలకు వెళ్లే వారిని, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి కుక్కలను తీసుకువెళ్లాలని కోరారు.
NLR: ప్రస్తుతం జరుగుతున్న IPL మ్యాచ్లో యువత బెట్టింగ్కు దిగి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగుల్లో ప్రతిసారి గెలుస్తామన్నది అవివేకమని, ఒక జూదం వంటిదని తెలిపారు. బుకీలు ఖాతాలలో ఎప్పుడూ డబ్బు ఉంటుందని, కానీ బెట్టింగ్ పాల్పడే వారే అప్పుల్లో ఉంటారని సూచించారు.