• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

ELR: చాట్రాయి మండలం అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న శ్రీనిధి, బ్యాంకు లింకేజి, వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీ వివరాలపై అరా తీశారు. ఫించన్ నిలుపుదల చేస్తే అందుకు తగిన కారణాలు పింఛన్ దారునికి తెలపాలన్నారు.

April 29, 2025 / 03:20 PM IST

క్రికెట్ శిక్షణ శిబిరానికి ఆహ్వానం

NLR: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి క్రికెట్ సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గలవారు క్రీడా మైదానంలోని క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

April 29, 2025 / 03:20 PM IST

ఖాళీ స్థలాలను పరిశీలించిన కలెక్టర్

W.G: ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కాళ్ల మండలం యూత్ క్లబ్ రోడ్ సాయిబాబా గుడి శివారు ప్రాంతంలో ఉన్న లే అవుట్లకు నిబంధనల ప్రకారం వదిలిన 10 శాతం ఖాళీ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు.

April 29, 2025 / 03:13 PM IST

ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం వేడుకలకు రైతులు

KRNL: గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 60 సంవత్సరాల వేడుకలకు మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు గ్రామం నుంచి రైతులు హాజరయ్యారు. పెద్దకడబూరుకు చెందిన బొగ్గుల నరసన్న, నల్లమల శాంతిరాజు, సామేలు లక్ష్మన్న, నాగరాజు ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వ్యవసాయంలో మెలకువలపై అవగాహన కల్పించారు.

April 29, 2025 / 03:09 PM IST

పొలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

KRNL: కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామం సమీపంలోని పొలాల్లో మంగళవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఈ శవాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం నుంచి అనేక ఆధారాలను పరిశీలించి, ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 29, 2025 / 02:31 PM IST

కేంద్రం చర్యలతో ఆర్డీటీ మనుగడకు ప్రమాదం

KRNL: రెండు రాష్ట్రాలలోనే అనేక గ్రామాలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఓ కల్పతరువు వంటిదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు. మంగళవారం తుగ్గలి మండలం లక్ష్మీతండాలో దేవర ఉత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆమె గిరిజనులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్డీటీకి ఒక మతం, ఒక ప్రాంతం అనేది లేదని స్పష్టం చేశారు.

April 29, 2025 / 02:28 PM IST

నందికొట్కూరు అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు పట్టణం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో పైపులైన్ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరో దారి ఏర్పాటు చేశామని చెప్పారు. కుక్కల బెడద, నీటి సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

April 29, 2025 / 02:20 PM IST

వేంపల్లి సమస్యల్ని పట్టించుకోండి: తులసి రెడ్డి

KDP: 60 వేలకు పైగా జనాభా ఉన్న వేంపల్లి మేజర్ పంచాయతీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని పీసీసీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని ఈ పంచాయతీలో సచివాలయ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు లేవని, పారిశుధ్యం అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు.

April 29, 2025 / 02:17 PM IST

ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్ వ్యతిరేకంగా సైకిల్ యాత్ర

KRNL: డ్రగ్స్, మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని DYFI జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర పిలుపునిచ్చారు. ఆదోనిలో డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించారు. యువత ఉపాధి లేక మత్తుపదార్థాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

April 29, 2025 / 02:14 PM IST

అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం

కృష్ణ: నూజివీడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన అధికారి దేవరకొండ భూషణం తెలిపారు. నూజివీడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 8వ తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు అర్హత కలిగిన వారు ఈ నెల 29 నుండి మే 24వ తేదీలోపు https//itiadmissions.ap.gov.in/iti/login.do ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చన్నారు.

April 29, 2025 / 02:05 PM IST

రీసర్వే ప్రక్రియను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మే 1న తేదీన వర్చువల్ విధానంలో టెక్స్ టైల్ పార్క్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు మంగళవారం సంబంధిత అధికారులతో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, MLA జయ నాగేశ్వర రెడ్డి కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బనవాసిలో టెక్స్ టైల్స్ పార్క్ స్థల ప్రాంతాన్ని తనిఖీ చేసి, ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

April 29, 2025 / 01:58 PM IST

అక్రమ తవ్వకాలు ఆపాలని ధర్నా

W.G: వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని మంగళవారం మొగల్తూరు గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. మొగల్తూరు నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న వక్ఫ్ బోర్డు భూములలో పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

April 29, 2025 / 01:45 PM IST

యశస్విని రోడ్డు ప్రమాదం బాధాకరం: ఎమ్మెల్యే

W.G: భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన యశస్విని రోడ్డు ప్రమాదం బాధాకరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి భీమవరం వస్తు రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. తుందుర్రులో యశస్విని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు.

April 29, 2025 / 01:41 PM IST

రేపు కౌన్సిల్ సాధారణ సమావేశం

TPT: పుత్తూరు పట్టణంలోని బుధవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు పుత్తూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు పుత్తూరు మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్స్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరవాలన్నారు.

April 29, 2025 / 01:12 PM IST

‘పూడిక తీసిన కమిషనర్ కృష్ణ’

KRNL: ఆదోని రెండో వార్డులో కమిషనర్ ఎం.కృష్ణ మంగళవారం పర్యటించారు. మాజీ కౌన్సిలర్ తిమ్మప్పతో కలిసి కాలువలలో పూడిక తీశారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల వద్దకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు.

April 29, 2025 / 11:24 AM IST