AKP: నక్కపల్లి మండలం రేబాక గ్రామంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, జనసేన నేత గెడ్డం బుజ్జి, బీజేపీ నాయకులు పాకలపాటి రవిరాజు, అల్లూరి మనమడు రాజు, సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కృష్ణా: నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని ఎస్సై అర్జున్ అన్నారు. ఎస్సై మాట్లాడుతూ.. పెనుగంచిప్రోలు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
కృష్ణా: మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం బెంగుళూరు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి బెంగుళూరు ప్రయాణమయ్యారు. కాగా జగన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా వారికి నమస్కరించిన ఆయన బెంగుళూరు పయనమయ్యారు.
NDL: తాగడానికి వెళ్లే వారి కోసం తారు రోడ్డు, స్కూల్కు వెళ్లి చదువుకునే విద్యార్థులకు మాత్రం మట్టి రోడ్డు వేశారని శుక్రవారం పాణ్యం విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మోడల్ స్కూల్కు విద్యార్థులు వెళ్లేందుకు సరైన రోడ్డు లేదని రోడ్డు వేయాలని ప్రజా, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
NTR: విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ. 2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.
సత్యసాయి: మడకశిరలో శివమాల దీక్షలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి బిక్షాటన చేశారు. శివమాల దీక్షలో భాగంగా మాఘ మాసం సందర్భంగా పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి ఆయన బిక్షాటన చేశారు. వీరి వెంట పలువురు శివ మాలలో ఉన్న శివ స్వాములు కలిసి బిక్షాటనలో పాల్గొన్నారు.
KRNL: కౌతాళం మండలం ఉప్పరహల్ గ్రామంలో శ్రీ దేవమ్మ అవ్వ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు అధ్వర్యంలో దేవాలయం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో టీడీపీ నేతలు చెన్నబసప్ప ధని, టిప్పు సుల్తాన్ ఉన్నారు.
W.G: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టాలపై పడుకోవడంతో తల తెగి పడింది. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమణ తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
కృష్ణా: కుమార్తె అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. టైనర్పేటకు చెందిన సుకన్య కబేల వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5 ఉదయం ఇంటి నుంచి ఉద్యోగానికి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి శ్రీనివాసరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
NTR: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రుల ర్యాంక్లలో 7వ స్థానంలో ఉన్నారు. ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా గురువారం సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రుల ర్యాంక్లు విడుదల చేయగా సత్యకుమార్ ఆ జాబితాలో 7వ స్థానం పొందారు. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర 12, కె.పార్థసారథి 23వ స్థానాల్లో ఉన్నారు.
NLR: నగరంలోని పలుచోట్ల వేర్వేరు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు. తల్లి తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటనతో పాటు, కొడుకులను తీసుకొని తండ్రి అదృశ్యమైన మరో ఘటనపై చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం కావడంతో నవాబ్ పేట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కోష్ట జాతీయ రహదారి పక్క శ్రీ కృష్ణ చైతన్య మఠం వారి గోశాల, శ్రీ రాధా గోవిందా గోకులానంద ఆశ్రమంలో శ్రీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రతిష్ట కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తు శ్రీ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, సాధువులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
NTR: విజయవాడ డివిజన్లో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. SHM-HYD (18045) SHM-MGR (12841), DHN-ALLP(13351), SRC-MGR(22807) TATA-SBC(12889) ఎక్స్ప్రెస్ రైలు నిడదవోలు గుడివాడ విజయవాడ మీదుగా సీఎస్టీ ముంబై భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
NTR: యువతి అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రబాలెంకి చెందిన నిహారిక (25) ఎర్రబాలెం నుంచి విజయవాడ అజిత్ సింగ్ నగర్కు ఫిబ్రవరి 5న వివాహ నిమిత్తం వచ్చింది. వివాహం అనంతరం ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్ల గాలించారు. భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.