కృష్ణా: కానూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కానూరులోని కామయ్యతోపు, మహాదేవపురం కాలనీ, సనత్ నగర్, 80 అడుగుల రోడ్డు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
కృష్ణా: కంకిపాడు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నవంబర్-2024లో నిర్వహించిన బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది. కాగా స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి.
ప్రకాశం: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారు రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా సూచించిన ప్రకారం ఈ నెల 7వ తేదీతో ముగిసింది. అయితే గడువును పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: మినీలారీని ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పామూరు మండలంలోని వగ్గంపల్లె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువకుడు తాటాకులతో వెళ్తున్న రిక్షాను ఓవర్ టేక్ చేయబోయాడు. తాటాకులు తగిలి బైక్ అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని మృతి చెందాడు. మృతుడి వివరాలకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
NTR: విజయవాడ హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాదులో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి ప్రారంభం అవుతాయని చెప్పారు. బస్సు సేవలు మొదలైన తర్వాత 4 వారాలపాటు రూ. 99తో హైదరాబాదు నుంచి విజయవాడకు ఉంటుందన్నారు.
పల్నాడు: ఎడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఘన, ద్రవ వర్థ్య పదార్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ హేమలత దేవి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సురక్షితమైన మరుగుదొడ్డిని విధిగా వినియోగించాలన్నారు. తడి, పొడి వ్యర్థాలను గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు ఇచ్చి వాటిని ఎరువుగా మార్చేందుకు సహకరించాలన్నారు. నీటిని వృథా చేయరాదని సూచించారు.
GNTR: విద్యార్థులు నిరంతర అధ్యయనంతో ఏదైనా సాధించవచ్చునని ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్లేబాక్ సింగర్ ఎస్.ఎస్.తమన్ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తమన్ మాట్లాడుతూ.. జీవితంలో ఏవైనా కొత్తవి నేర్చుకోవడానికి ఆలస్యం చేయవద్దని సూచించారు.
GNTR: సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో జిల్లా మంత్రులు నాదెండ్ల మనోహర్కు 4 ర్యాంకు రాగా, లోకేష్కు 8వ ర్యాంకు పొందారు.
GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. పోలవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిర్రి బాలరాజు వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, వీరమహిళ రావి సౌజన్య ఉన్నారు.
GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు. డ్రైనేజీ కెనాల్ దగ్గర మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఆచూకీ తెలిసినవారు చేబ్రోలు పోలీసులను సంప్రదించాలని కోరారు.
ELR: ఉంగుటూరు మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూలు చేస్తామని ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరకు నూరు శాతం పన్ను వసూలు చేసే లక్ష్యంగా పంచాయితీ కార్యదర్శులు పనిచేయాలన్నారు. మొండి బకాయి దారులకు కార్యదర్శులు నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలన్నారు.
GNTR: గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలుపుకు కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి విడదల రజిని హాజరుకావాలని గురువారం ఆర్యవైశ్యులు ఆమె నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఈనెల 8వ తారీఖున జరుగుతుందని తెలిపారు.