• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోమశిల జలాశయంలో 53టీఎంసీలు నీరు నిల్వ

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6గంటల నాటికి సోమశిల జలాశయంలో 53.269 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 285 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

April 1, 2025 / 07:31 AM IST

‘కుక్కల బెడద నుంచి కాపాడండి’

ప్రకాశం: మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో కుక్కలు బెడదతో గ్రామస్తులు భయం భయంతో జీవిస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు మహిళలను వెంటపడి మరీ కరిచాయి. ఎస్సీ పాలెంలో సుమారు 40 కుక్కలకు పైగా వీధుల్లో తిరుగుతూ నిత్యం పొలాలకు వెళ్లే వారిని, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి కుక్కలను తీసుకువెళ్లాలని కోరారు.

April 1, 2025 / 07:12 AM IST

యువత బెట్టింగ్‌‌లకు పాల్పడొద్దు: ఎస్పీ

NLR: ప్రస్తుతం జరుగుతున్న IPL మ్యాచ్‌లో యువత బెట్టింగ్‌కు దిగి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగుల్లో ప్రతిసారి గెలుస్తామన్నది అవివేకమని, ఒక జూదం వంటిదని తెలిపారు. బుకీలు ఖాతాలలో ఎప్పుడూ డబ్బు ఉంటుందని, కానీ బెట్టింగ్ పాల్పడే వారే అప్పుల్లో ఉంటారని సూచించారు.

April 1, 2025 / 07:12 AM IST

పరమేశ్వరి దేవి బోనాలకు ఏర్పాట్లు

NDL: పట్టణంలోని టేక్కేసుంకల పరమేశ్వరి అమ్మవారికి రేపు బోనాలు సమర్పిస్తున్నట్లు కమిటీసభ్యులు చింత శ్రీనివాసులు తెలిపారు. చైత్ర శుద్ధ తదియ మంగళవారం ఉదయం 5గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నట్లువెల్లడించారు. భక్తులువిచ్చేసి అమ్మవారికృపకు పాత్రులు కావాలనికోరారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 31, 2025 / 07:39 PM IST

‘ఎస్సీ వర్గీకరణ‌పై సమావేశం’

SKLM: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో భాగంగా తీరని అన్యాయం చేస్తుందని రెల్లి కుల సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. సోమవారం నరసన్నపేటలోని స్థానిక పురుషోత్తం నగర్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 వర్గాలకు చెందిన ఎస్సీ వర్గీకరణలో భాగంగా కేవలం మహిళలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు.

March 31, 2025 / 07:03 PM IST

జన్మభూమి అప్ డేటెడ్ వెర్షన్ P-4

PLD: జన్మభూమి అప్ డేటెడ్ వెర్షన్ P-4 అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో సోమవారం మీడియాతో మాట్లాడారు గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జన్మభూమి గ్రామాల రూపురేఖలు మార్చిందన్నారు. ఇప్పుడు ఆయన ఆలోచన నుంచి పుట్టిన P-4 దేశానికే మార్గదర్శకంగా నిలవనుందన్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సంపన్న వర్గాలు చేయూతనివ్వడమే P-4 విధానమని చెప్పారు.

March 31, 2025 / 05:16 PM IST

తాగునీటి పైపులైనుకు మరమ్మత్తులు

AKP: మాకవరపాలెం గ్రామంలో కొత్త వీధిలో ఉన్న తాగునీటి పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు. సోమవారం పంచాయతీ ఈవో బాల దొర మాట్లాడుతూ.. కొత్త కాలువ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు పైపులైన్లు మరమ్మతులు గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలోనే మరమ్మత్తులు చేపట్టి బుధవారం నాటికి కొత్త వీధిలో తాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు.

March 31, 2025 / 05:04 PM IST

రేపు 2,79,165 మందికి పింఛన్ పంపిణీ

ATP: జిల్లాలో రేపు ఉదయం 7 గంటల నుంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి అందజేస్తారని చెప్పారు. జిల్లాలో 2,79,165 మందికి రూ.123.76 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. రేపు పింఛన్ తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారని తెలిపారు.

March 31, 2025 / 04:36 PM IST

అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

SS: లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్‌ఏ ఇంటిపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు.

March 31, 2025 / 04:21 PM IST

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే తొలి ప్రధాన్యం

SS: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి సవిత అన్నారు. సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు, గుడిపల్లి, తుంగోడు, వెలిదడకల,నడింపల్లి పంచాయతీలోని నాయకులతో పెనుకొండలో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు. గ్రామాల వారిగా ఎలాంటి సమస్యలు ఉన్నాయని మంత్రి ఆరా తీశారు.

March 31, 2025 / 04:13 PM IST

నరసరావుపేటలో భగ్గుమన్న భానుడు

PLD: నరసరావుపేట పట్టణంలో సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 20° వద్ద నుంచి ప్రారంభమైన ఉష్ణోగ్రత గంటకు పెరుగుతూ మధ్యాహ్నం రెండు గంటలకు 42 డిగ్రీల వద్దకు చేరుకుంది. రంజాన్ పర్వదినం కావడంతో ముస్లిం సోదరులు ప్రార్థనలకు వెళ్లి వచ్చేందుకు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డారు.

March 31, 2025 / 03:51 PM IST

వక్స్ సవరణ బిల్లు వ్యతిరేఖిస్తూ నిరసన

W.G: కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్స్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుంచి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్, ఇలియాస్ పాల్గొన్నారు.

March 31, 2025 / 03:19 PM IST

మహిళకు పవన్ కళ్యాణ్ రంజాన్ కానుక

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి చెందిన కౌలు రైతు హలీమా కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ కానుక అందజేశారు. పవన్ తరఫున పట్టుచీర, రూ.25,000లు ఆర్థిక చేయూత, పండ్లతో కూడిన రంజాన్ తోఫాను జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ఆ పార్టీ కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఆ కుటుంబ సభ్యులు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 31, 2025 / 01:42 PM IST

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వెనక్కి తీసుకోవాలి

BPT: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం కర్లపాలెం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధార్మిక కార్యక్రమాల కోసం దూరదృష్టితో పూర్వికులు తమ ఆస్తులను వక్ఫ్‌ చేశారని తెలిపారు.

March 31, 2025 / 01:38 PM IST

మడకశిర అర్బన్ సీఐ హెచ్చరిక

సత్యసాయి: మడకశిర ప్రాంతంలో వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ నాగేశ్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అదుపు చేయలేని వేగం, అవగాహన లేని డ్రైవింగ్ ప్రాణానికి ముప్పు తెస్తుందన్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు పెళ్లరాదని, హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలన్నారు.

March 31, 2025 / 01:15 PM IST