సత్యసాయి: ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మే 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు నాగేంద్ర కోరారు. మంగళవారం శిబిరానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాలవారు కూడా శిబిరానికి హాజరుకావాలని సూచించారు.
KRNL: మేడే ఉత్సావాలకు ప్రతి కార్మికుడు సిద్ధంకావాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, AITUC మండల కార్యదర్శి చిన్నరాముడు, ఆటో యునియన్ నాయకులు పిలుపునిచ్చారు. మేడే దినోత్సవం సందర్భంగా కోడుమూరులో ఎద్దుల మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన 100 రెడ్ టీ షర్టులను హమాలీలకు మంగళవారం పంపిణీ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడే రోజుగా జరుపుకుంటామని తెలిపారు.
TPT: గంగమ్మ ఆలయ అధికారులు మంగళవారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. ఇందులో భాగంగా గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. జాతరకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.
సత్యసాయి: రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సహచర నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో నాలుగు దశాబ్దాలుగా బీజేపీ విస్తరణకు సత్యనారాయణ ఎంతో కృషి చేశారని మంత్రి కొనియాడారు.
NLR: అల్లూరు మండల ప్రజలకు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీనారాయణ పలు సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా రానున్న రోజుల్లో ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప ఉదయం 10:00 గం // నుండి సాయంత్రం 4:00 గం// మధ్యలో బయటకు రాకూడదని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ATP: నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్లో మంగళవారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని అనంత ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఇదే కూటమి ప్రభుత్వం విధానమని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SKLM: పాతపట్నం మండలంలోని ఏఎస్ కవిటి గ్రామానికి చెందిన సర్పంచ్ నక్క మార్కండేయులు, కోగాన సంజీవరావు ఆహ్వానం మేరకు గ్రామదేవత ఉత్సవాలలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తీర్ధ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.
ELR: చాట్రాయి మండలం అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న శ్రీనిధి, బ్యాంకు లింకేజి, వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీ వివరాలపై అరా తీశారు. ఫించన్ నిలుపుదల చేస్తే అందుకు తగిన కారణాలు పింఛన్ దారునికి తెలపాలన్నారు.
NLR: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి క్రికెట్ సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గలవారు క్రీడా మైదానంలోని క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
W.G: ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కాళ్ల మండలం యూత్ క్లబ్ రోడ్ సాయిబాబా గుడి శివారు ప్రాంతంలో ఉన్న లే అవుట్లకు నిబంధనల ప్రకారం వదిలిన 10 శాతం ఖాళీ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు.
KRNL: గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 60 సంవత్సరాల వేడుకలకు మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు గ్రామం నుంచి రైతులు హాజరయ్యారు. పెద్దకడబూరుకు చెందిన బొగ్గుల నరసన్న, నల్లమల శాంతిరాజు, సామేలు లక్ష్మన్న, నాగరాజు ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వ్యవసాయంలో మెలకువలపై అవగాహన కల్పించారు.
KRNL: కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామం సమీపంలోని పొలాల్లో మంగళవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఈ శవాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం నుంచి అనేక ఆధారాలను పరిశీలించి, ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: రెండు రాష్ట్రాలలోనే అనేక గ్రామాలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఓ కల్పతరువు వంటిదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు. మంగళవారం తుగ్గలి మండలం లక్ష్మీతండాలో దేవర ఉత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆమె గిరిజనులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్డీటీకి ఒక మతం, ఒక ప్రాంతం అనేది లేదని స్పష్టం చేశారు.
NDL: నందికొట్కూరు పట్టణం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో పైపులైన్ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరో దారి ఏర్పాటు చేశామని చెప్పారు. కుక్కల బెడద, నీటి సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
KDP: 60 వేలకు పైగా జనాభా ఉన్న వేంపల్లి మేజర్ పంచాయతీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని పీసీసీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని ఈ పంచాయతీలో సచివాలయ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు లేవని, పారిశుధ్యం అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు.