SKLM: సోంపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. చిన్నాజీవర్మ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TPT: గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం పురావస్తు శాఖ డైరెక్టర్ అజ్మీర్ బీమా పర్యటించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, రానున్న కుంభాభిషేకం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.
PKSM: కొండపిలో కేజీ చికెన్ 280 అమ్ముతున్నారు. స్కిన్ లెస్ చికెన్ 310 వరకు అమ్ముతున్నారు. కాగా కేజీ చికెన్కు కాంటాలో మాయాజాలం చూపిస్తూ 900 గ్రాములు మాత్రం ఇస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నేడు ఆదివారం కావడంతో చికెన్ కోసం షాపులు దగ్గర అధిక సంఖ్యలో చికెన్ కొనుగోలు దారులు ఉన్నారు.
PPM: మన్యం లీగ్స్-2026 జిల్లా స్థాయి క్రికెట్లో విజేతగా కురుపాం జట్టు నిలిచింది. ఈ మేరకు శనివారం నిర్వాహకులు DSTO శ్రీధర్ చేతులమీదుగా విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5వేలు నగదు బహుమతి అందించారు. రన్నరప్గా వీరఘట్టం జుట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానం సాధించిన కొండవాడ జట్టుకు రూ.2వేలు బహుమతి అందజేసారు. అనంతరం డీఎస్టీవో శ్రీధర్ విజేతలను అభినందించారు.
CTR: గుడిపాల మండల పరిధిలో శనివారం భారీగా పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వేలూరు వైపుగా పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను 2 టౌన్ సీఐ, గుడిపాల యాదమరి ఎస్సై తనిఖీ చేశారు. కూల్ లిప్స్, హాన్స్, విమల్ 23 బ్యాగులు, యాదమరి జంక్షన్ వద్ద 22 బ్యాగులు, 2 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు.
పల్నాడు: నరసరావుపేటలో చికెన్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. పండగల సీజన్ కావడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం లైవ్ కోడి కిలో రూ.180 పలుకుతుండగా, స్కిన్ చికెన్ రూ.320-340, కీమా 340-360కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1000కి చేరగా, 100 గుడ్ల ధర రూ. 445గా ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
WG: కొవ్వాడ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరగపర్రు రోడ్, విష్ణు కాలేజీ రోడ్డు, దుర్గపురం, కొవ్వాడ, అన్నవరం తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు
తిరుపతిలో రైల్వే పోలీసుల అప్రమత్తతతో గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. డీఎస్పీ మురళీ మార్గదర్శకత్వంలో GRPS, RPF సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17 ప్యాకెట్లలో సుమారు 15.460 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 వేలుగా ఉంటుదని వారు అంచనా వేశారు.
KKD: విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని డీఎస్ఓ సత్యనారాయణ రాజు దాడి చేసి పట్టుకున్నారు. కాకినాడ పోర్టులో ఐదు లారీల్లో 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా సమాచారం తెలుసుకున్న డీఎస్ఓ ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మొత్తం 140 టన్నుల బియ్యం ఖరీదు రూ.65లక్షలు ఉంటుందని వెల్లడించారు. ధాన్యాన్ని, ఎక్స్పోర్టు చేస్తున్న లారీలను సీజ్ చేశామని తెలిపారు.
EG: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
KDP: ప్రొద్దుటూరులో శనివారం రాత్రి స్థానిక రామేశ్వరంలో జరుగుతున్న దేవర ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ విభూకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులందరిని బందోబస్తుకు ఉంచారు. సీఐలు, ఎస్సైలతో పాటు 70 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు.
ATP: కళ్యాణదుర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో కన్నుమూశారు. యర్రంపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీ EO ఝాన్సీ రాణి తన సిబ్బందితో కలసి శనివారం పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించిన వారికి ఆన్లైన్ రసీదులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీకి ఇంటి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. అనంతరం పంచాయతీ సిబ్బంది చేపడుతున్న రసీదుల పంపిణీని స్దానిక MPDO సురేష్ పర్యవేక్షించారు.
NLR: ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేట యాగర్ల బ్రిడ్జి వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకున్నది. మైపాడు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులకి ఎటువంటి గాయాలు కాలేదు. చుట్టుప్రక్కల ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో డీ. సత్యనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంబంధిత అధికారులు, సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.