• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు నియమాలను తప్పక పాటించాలి: సీఐ

NLR: సంగం వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి సీఐ శ్రీనివాస రెడ్డి, S1 రాజేశ్ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. అలాగే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

March 22, 2026 / 07:30 AM IST

బెస్త కళ్యాణ మండప నిర్మాణానికి భారీ విరాళం

సత్యసాయి: పుట్టపర్తిలో బెస్త కళ్యాణ మండప నిర్మాణానికి ప్రముఖుడు బెస్త బయన్న రూ. 5,10,012 విరాళం అందజేశారు. ఈ నిధులు నిర్మాణ పనులకు కీలకంగా మారుతాయని కమిటీ సభ్యులు జ్యోతి కేశవ, జై సాయి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, కులస్తులు, దాతలు సహకరించాలని కోరారు. సామాజిక బాధ్యతతో స్పందించిన బయన్నను స్థానికులు అభినందిస్తున్నారు.

March 22, 2026 / 07:29 AM IST

హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 271 మందిపై కేసులు నమోదు చేసి, రూ.57,450 జరిమానా విధించారు. కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 07:28 AM IST

తడసిన పంటలను పరిశీలించిన సీపీఐ బృందం

ELR: వేలేరుపాడు మండలంలో తడిసిన మిర్చి మొక్కజొన్న, వేరుశనగ, పుల్ల శనగ, కంది తదితర పంటలను సీపీఐ మండల బృందం శనివారం పరిశీలించింది. అకాల వర్షం కారణంగా తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు దరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.50 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులని ఆదుకోవాలని మండల కార్యదర్శి బాడిశ రాము కోరారు.

March 22, 2026 / 07:28 AM IST

కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాకేష్

WG: కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా తణుకు పట్టణానికి చెందిన గురుజుకోట రాకేష్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకులు శనివారం తణుకు విచ్చేసి నియామక పత్రాలు అందజేశారు. కుమ్మర శాలివాహన సంక్షేమం అభివృద్ధి కోసం కృషిచేసి, సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని రాకేష్ బాబు తెలిపారు.

March 22, 2026 / 07:27 AM IST

మంత్రి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో పలుకూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అన్నారు.

March 22, 2026 / 07:26 AM IST

శ్రీశైలంలో వీడియో వైరల్.. కేసు నమోదు

NDL: శ్రీశైలం ఆలయంలోని స్వామివారి మూల విరాట్ వీడియో వైరల్ ఘటనను దేవస్థానం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సుబ్బారెడ్డి తెలిపారు.

March 22, 2026 / 07:23 AM IST

ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: సోంపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. చిన్నాజీవర్మ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 22, 2026 / 07:20 AM IST

పరశురామేశ్వర ఆలయాన్ని సందర్శించిన పురావస్తు డైరెక్టర్

TPT: గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం పురావస్తు శాఖ డైరెక్టర్ అజ్మీర్ బీమా పర్యటించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, రానున్న కుంభాభిషేకం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.

March 22, 2026 / 07:16 AM IST

కొండపిలో చికెన్ ధరలు ఎంతంటే..?

PKSM: కొండపిలో కేజీ చికెన్ 280 అమ్ముతున్నారు. స్కిన్ లెస్ చికెన్ 310 వరకు అమ్ముతున్నారు. కాగా కేజీ చికెన్‌కు కాంటాలో మాయాజాలం చూపిస్తూ 900 గ్రాములు మాత్రం ఇస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నేడు ఆదివారం కావడంతో చికెన్ కోసం షాపులు దగ్గర అధిక సంఖ్యలో చికెన్ కొనుగోలు దారులు ఉన్నారు.

March 22, 2026 / 07:14 AM IST

మన్యం లీగ్ క్రికెట్ 2026 విజేతగా కురుపాం టీం

PPM: మన్యం లీగ్స్‌-2026 జిల్లా స్థాయి క్రికెట్‌లో విజేతగా కురుపాం జట్టు నిలిచింది. ఈ మేరకు శనివారం నిర్వాహకులు DSTO శ్రీధర్ చేతులమీదుగా విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5వేలు నగదు బహుమతి అందించారు. రన్నరప్‌గా వీరఘట్టం జుట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానం సాధించిన కొండవాడ జట్టుకు రూ.2వేలు బహుమతి అందజేసారు. అనంతరం డీఎస్టీవో శ్రీధర్‌ విజేతలను అభినందించారు.

March 22, 2026 / 07:10 AM IST

మండలంలో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్

CTR: గుడిపాల మండల పరిధిలో శనివారం భారీగా పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వేలూరు వైపుగా పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను 2 టౌన్ సీఐ, గుడిపాల యాదమరి ఎస్సై తనిఖీ చేశారు. కూల్ లిప్స్, హాన్స్, విమల్ 23 బ్యాగులు, యాదమరి జంక్షన్ వద్ద 22 బ్యాగులు, 2 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు.

March 22, 2026 / 07:10 AM IST

పల్నాడులో కేజీ చికెన్ ధర రూ.340

పల్నాడు: నరసరావుపేటలో చికెన్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. పండగల సీజన్ కావడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం లైవ్ కోడి కిలో రూ.180 పలుకుతుండగా, స్కిన్ చికెన్ రూ.320-340, కీమా 340-360కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1000కి చేరగా, 100 గుడ్ల ధర రూ. 445గా ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో  కామెంట్ చేయండి.

March 22, 2026 / 07:09 AM IST

నేడు కొవ్వాడలో పవర్ కట్

WG: కొవ్వాడ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరగపర్రు రోడ్, విష్ణు కాలేజీ రోడ్డు, దుర్గపురం, కొవ్వాడ, అన్నవరం తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు

March 22, 2026 / 07:09 AM IST

గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

తిరుపతిలో రైల్వే పోలీసుల అప్రమత్తతతో గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. డీఎస్పీ మురళీ మార్గదర్శకత్వంలో GRPS, RPF సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17 ప్యాకెట్లలో సుమారు 15.460 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 వేలుగా ఉంటుదని వారు అంచనా వేశారు.

March 22, 2026 / 07:08 AM IST