• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

NDL: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవిలో శైలేశ్వరం జాతర, ఆదివారం సెలవు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై బారులు తీరారు. ఉచిత దర్శనానికి 5 గంటలు, టికెట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండడంతో క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

April 13, 2025 / 05:18 PM IST

‘అంబేద్కర్ జయంతి విజయవంతం చేయండి’

NDL: నందికోట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ పంక్షన్ హాల్ నందు సోమవారం ఉదయం 10.00 గం.లకు అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే జయసూర్య అద్యక్షత నిర్వహించబడును. ఈ మేరకు అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రభుత్వ అధికారులు పాల్గొనాలని విజయవతం చేయాలని సమాచార ప్రతి నిధులు ఆదివారం పిలుపునిచ్చారు.

April 13, 2025 / 04:59 PM IST

అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి

NDL: గోస్పాడు మండలం తేళ్ళపురి గ్రామంలో TDP హయాంలో జరిగిన పనులు రోడ్లు కాలువలు పలు అభివృద్ధి పనులను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం పరిశీలించారు. గత 5 సంవత్సరాల YCP పాలనలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందలేదన్నారు. కూటమి అధికారం చేపట్టిన 10 నెలలలోనే అనేక అభివృద్ధి పనులు రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి, వీధి దీపాలు లాంటి ఎన్నో పనులకు శ్రీకారం చుట్టామన్నారు.

April 13, 2025 / 04:33 PM IST

రంగనాథ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు లబ్బి వెంకట స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి అమ్మ వార్లకు పూజలు చేయించి, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

April 13, 2025 / 04:25 PM IST

జాతర మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ

KDP: పెద్దముడియం మండలం దిగువకల్వటాల గ్రామంలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవానికి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.

April 13, 2025 / 04:20 PM IST

ఏపి సన్షైన్ స్టార్ అవార్డుకు ఎంపికైన స్రవంతి

CTR: రొంపిచర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఏపి సన్షైన్ అవార్డుకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న స్రవంతి సీఈసీ గ్రూపులో 935 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినందుకు అవార్డుకు ఎంపికైందన్నారు. స్రవంతి ప్రతిభను గుర్తించి ఏప్రిల్ 15వ తేదీ విద్యామంత్రి నారా లోకేశ్ అవార్డు అందజేస్తారని తెలిపారు.

April 13, 2025 / 04:18 PM IST

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ASR: అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీ గుగ్గుడు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో లౌకిక, ప్రజాస్వామ్య రక్షణకు, ఆదివాసీ హక్కులు చట్టాల అమలుకు పోరాడాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, మాజీ MPTC దశరథ్ అన్నారు. జీవో నెం.3 అమలు చేయాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.

April 13, 2025 / 03:47 PM IST

రేపు అంబేద్కర్ జయంతి వేడుకలు

PPM: భారత రాజ్యాంగ నిర్మాత డా,బి.ఆర్.అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభంమవుంతుదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని చెప్పారు.

April 13, 2025 / 01:34 PM IST

దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

ప్రకాశం: వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వేరే ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇంటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకొని మొబైల్ ఫోన్లలో వాచ్ చేయాలన్నారు. లేకుంటే పోలీసుల లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలన్నారు.

April 13, 2025 / 12:50 PM IST

నాడు విద్యార్థిగా.. నేడు ముఖ్య అతిథిగా!

ATP: బెంగళూరులోని MAHE యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి పయ్యావుల కేశవ్ అతిథిగా పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం తాను ఇక్కడే ఎంబీఏ డిగ్రీ పట్టా తీసుకున్నానని అన్నారు. నేడు తన చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రధానం ఆనందంగా ఉందన్నారు.

April 13, 2025 / 11:20 AM IST

రేపు ఫిర్యాదుల స్వీకరణ ఉండదు: కలెక్టర్

ATP: అనంతపురంలో రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశారు. కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ సెలవు ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

April 13, 2025 / 11:00 AM IST

శ్రీ మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు

KNRL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం మూల బృందావనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో మొదలుకొని నిర్మాల్యం క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో బృందావనాన్ని చక్కగా అలంకరించారు.పీఠాధిపతి బృందావనానికి నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.

April 13, 2025 / 10:47 AM IST

ఇంటర్ దరఖాస్తుకు గడువు పెంపు

KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరకు నిర్దేశించగా.. ప్రస్తుతం ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.

April 13, 2025 / 09:49 AM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అన్నా రాంబాబు

ప్రకాశం: మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారి కళ్యాణమహోత్సవానికి మార్కాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నారాంబాబు హాజరై స్వామివారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో అన్నారాంబాబు సతీమణి దుర్గకుమారి పాల్గొన్నారు. ముందుగా ఆలయ ధర్మకర్తలు అన్నారాంబాబును ఘనంగా సన్మానించారు.

April 13, 2025 / 08:20 AM IST

మరిడమ్మని దర్శించుకున్న హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్

KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని విజయవాడ వెలగపూడి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. కోటేశ్వరరావు, రాజమండ్రి కోర్టు జడ్జి జగదీశ్వరులు దర్శించుకున్నారు. శనివారం ఆయన మరిడమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం తరుపున వేద పండితులు, ఆసాధులు ఆలయ మర్యాదలతో సత్కరించి వేద ఆశీర్వచనాలతో అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

April 13, 2025 / 07:45 AM IST