ప్రకాశం: ఒంగోలు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణపై రచించిన ఘట్టమనేని కృష్ణ జీవిత శతక రత్న వరాల పుస్తకాన్ని విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహన దారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని వాకబు చేశారు. వాహనాల్లో నిషేధిత వస్తువులు సరఫరా, రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు.
KNRL: దేవనకొండ మండలం వెంకటాపురంలో లక్ష్మి (23) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి లలిత తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మి కర్నూలుకు చెందిన మనోహర్తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భర్త ప్రతిరోజూ లక్ష్మిని వేధించేవాడని ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని లలిత ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
ప్రకాశం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కోసం రూపొందించిన తాత్కాలిక సినియారిటీ జాబితాను వెబ్ సైట్లో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీ లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
ప్రకాశం: వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
ELR: అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న మారుజాతి కలపను సీజ్ చేసినట్లు ఎఫ్ఎస్వో బి.దినేష్ తెలిపారు. శనివారం తెల్లవారు జామున ప్రత్తిపాడు నుంచి కొయ్యలగూడెం వస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.25వేలు ఉంటుందన్నారు. వాహనాన్ని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.
PLD: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీఎం ఎఫ్ఎంఈ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ జనార్దన్ రావు తెలిపారు. శనివారం నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 35 శాతం సబ్సిడీపై రుణ సదుపాయం కలిపిస్తుందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: ఓర్వకల్లు మండలం శకునాలకు చెందిన శీలం మాధవి (45) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, భర్త శీలం చిన్నరాజు మద్యానికి బానిసై, పనికి వెళ్లకుండా ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
కృష్ణా: గుడివాడలో వ్యభిచార గృహంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. తాలూకా పోలీసే స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుస్తోందన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై ఎన్.చంటిబాబు సిబ్బందితో దాడి చేశారు. ఇంటి యజమాని యలవర్తి లక్ష్మీ, జోసెఫ్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. 2 సెల్ ఫోన్లు, బైక్, 2 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి పౌర్ణమి పూజలను శనివారం వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవను చేశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల నందు చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు చేశారు.
TPT: ఈనెల 14వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా కేంద్రానికి, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలకు రావద్దని ఆయన సూచించారు.
TPT: ఈనెల 14న బీఆర్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం సంధర్బంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో పోలీస్ కార్యాలయంలో నిర్వహించే PGRSకు రావొద్దని తెలిపారు.
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలో వెలసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా స్వామివారి రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ:శివాయ అంటూ రథాన్ని ముందుకు లాగారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 84% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలను ప్రిన్సిపల్ హసీనా బేగం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఉత్తీర్ణులైన బాలికలు భవిష్యత్తులో కూడా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆమె కోరారు.
ప్రకాశం: దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో శనివారం శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.