• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేషన్ బియ్యం సీజ్.. 140క్వింటాళ్లు స్వాధీనం

KKD: విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని డీఎస్ఓ సత్యనారాయణ రాజు దాడి చేసి పట్టుకున్నారు. కాకినాడ పోర్టులో ఐదు లారీల్లో 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా సమాచారం తెలుసుకున్న డీఎస్ఓ ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మొత్తం 140 టన్నుల బియ్యం ఖరీదు రూ.65లక్షలు ఉంటుందని వెల్లడించారు. ధాన్యాన్ని, ఎక్స్‌పోర్టు చేస్తున్న లారీలను సీజ్ చేశామని తెలిపారు.

March 22, 2026 / 07:07 AM IST

‘10,897 గ్యాస్ సిలిండర్లు సిద్ధం’

EG: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:07 AM IST

ప్రొద్దుటూరు దేవరకు భారీ బందోబస్తు

KDP: ప్రొద్దుటూరులో శనివారం రాత్రి స్థానిక రామేశ్వరంలో జరుగుతున్న దేవర ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ విభూకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులందరిని బందోబస్తుకు ఉంచారు. సీఐలు, ఎస్సైలతో పాటు 70 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు.

March 22, 2026 / 07:03 AM IST

హనుమంతరాయ చౌదరికి ఎమ్మెల్యే కందికుంట నివాళి

ATP: కళ్యాణదుర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో కన్నుమూశారు. యర్రంపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 22, 2026 / 07:01 AM IST

ఇంటిపన్ను రసీదులను పంపిణీ చేసిన ఈవో

VZM: చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ EO ఝాన్సీ రాణి తన సిబ్బందితో కలసి శనివారం పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించిన వారికి ఆన్‌లైన్‌ రసీదులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీకి ఇంటి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. అనంతరం పంచాయతీ సిబ్బంది చేపడుతున్న రసీదుల పంపిణీని స్దానిక MPDO సురేష్ పర్యవేక్షించారు.

March 22, 2026 / 07:00 AM IST

తప్పిన ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు

NLR: ఇందుకూరుపేట మండలంలోని డేవిస్‌పేట యాగర్ల బ్రిడ్జి వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకున్నది. మైపాడు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులకి ఎటువంటి గాయాలు కాలేదు. చుట్టుప్రక్కల ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

March 22, 2026 / 07:00 AM IST

నేడు జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో డీ. సత్యనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంబంధిత అధికారులు, సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.

March 22, 2026 / 07:00 AM IST

కొండకర్లలో ముగిసిన చదరంగం పోటీలు

AKP: ఉగాది సందర్భంగా అచ్యుతాపురం మండలం కొండకర్లలో నిర్వహించిన మండల స్థాయి చదరంగం పోటీలు శనివారం ముగిసాయి. ఈ పోటీల్లో తిమ్మరాజుపేటకు చెందిన పీ శ్రీనివాసరావు ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ద్వితీయ స్థానంలో అనకాపల్లికి చెందిన కె తేజ, మూడవ స్థానంలో తిమ్మరాజుపేటకు చెందిన పీ నాగు, జూనియర్ విభాగంలో కౌశిక్, చైతన్య ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు.

March 22, 2026 / 07:00 AM IST

ఒడిశా వ్యక్తిపై దాడి.. ఐదుగురు అరెస్ట్

VSP: ఒడిశాకు చెందిన వ్యక్తి విశాఖలోని లాడ్జిలో దిగారు. ఐదుగురు వ్యక్తులు ఆయనను పరిచయం చేసుకొని మద్యం కొనుగోలు చేయించి దాడి చేశారు. అనంతరం సెల్ ఫోన్, నగదు దోచుకున్నారు. బాధితుడు ఎంవీపీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుంకరి గౌతమ్, కన్నన్ చందు, వంగర సాయిదినేశ్, నిశాంత్ రెడ్డి, జగదీశ్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చక్రధర్ రావు తెలిపారు.

March 22, 2026 / 07:00 AM IST

వలకు చిక్కిన అరుదైన కచ్చిడి చేపలు

కోనసీమ: సఖినేటిపల్లి మండలం పల్లెపాలెం మత్స్యకారుల వలకు శనివారం రెండు అరుదైన ఆడ కచ్చిడి చేపలు చిక్కాయి. ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. అయితే ఇవి ఆడ చేపలు కావడంతో ఆశించిన స్థాయిలో ధర రాదని, అదే మగ చేపలు అయితే భారీ ధర పలికేవని మత్స్యకారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకి వెళ్లిన సమయంలో ఈ చేపలు లభించాయని తెలిపారు. 

March 22, 2026 / 07:00 AM IST

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం ఎంతంటే..?

NDL: 30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. 122 గ్రాముల బంగారు, 6 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభించిందని, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.

March 22, 2026 / 06:55 AM IST

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

ELR: విద్యార్థులందరూ చదువులోనే కాకుండా క్రీడల్లో, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ముందుండాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి జంగారెడ్డి గూడెం మండలం వేగవరంలో ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక రంగాలలోనూ ముందుండాలని సూచించారు.

March 22, 2026 / 06:49 AM IST

భీమవరంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు

W.G: భీమవరంలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్-23 పురుషుల, మహిళల ఓపెన్ బాక్సింగ్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ-2026’ పేరిట ఈ ఛాంపియన్ షిప్‌ను నిర్వహిస్తున్నారు. యువ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

March 22, 2026 / 06:42 AM IST

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరిస్తాం: గోరంట్ల

E.G: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కోలమూరు పంచాయతీ రాయుడుపాకలో ఉపాధి హామీ కూలీల సమస్యలను శనివారం స్వయంగా తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఐరిస్ పడని వారికి బయోమెట్రిక్ సౌకర్యం కల్పించాలని సూచించారు.

March 22, 2026 / 06:40 AM IST

ఈనెల 25 నుంచి బ్రహ్మోత్సవాలు

GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెం శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని ధర్మకర్తలు వాసిరెడ్డి దుర్గాప్రసాద్, పుతుంబాక సత్యసాయికృష్ణ, వాసిరెడ్డి శ్రీకృష్ణ, నాగార్జున తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

March 22, 2026 / 06:38 AM IST