E.G: ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. కొత్తపేట కళానగర్ వినాయకుని గుడిలో పూజలు జరిపించి కొత్తపేట నియోజక వర్గ ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో గురువారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సంజీవ్ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు.
NDL: బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామం వద్ద ఎన్హెచ్ 340B హైవే రహదారికి తూర్పున ఉన్న పొలాలకు రస్తా కోసం రైతులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పొలాలకు వెళ్లే రాస్తాను గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే కోట్లకు వినతిపత్రం అందజేశారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించారు. రేగడికొత్తూరుతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరయ్యను ఆమె పరామర్శించారు. అనంతరం ఆకులేడు గ్రామంలో నాగరాజు భౌతికకాయానికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
NLR: బుచ్చి మండలంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్, వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
NLR: ముత్తుకూరు మండలం వల్లూరులోని పశువైద్యశాలతోపాటు సిమెంట్ రోడ్లను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీయాలన్నారు.
W.G: రాష్ట్రంలోని పట్టభద్రులంతా జనసేన వైపు చూస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత వెళ్ళిపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థి రాజశేఖరంను గెలిపించుకోవాలన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని అంగన్వాడీ టీచర్లను కోరారు.
GNTR: అమరావతిలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై జరిగిన నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై ముఖ్య నాయకులకు మంత్రి పలు సూచనలు చేశారు. అలాగే కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు.
TPT: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకీ ఇవాళ ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రిన్సిపల్ రమణకు ఆగంతకులు మెయిల్ చేశారు. అప్రమత్తమైన ప్రిన్సిపల్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో డిస్పోజబుల్ టీం, పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
SKLM: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా నరసన్నపేట మండలంలో 1352 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ టి. సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 105 రోజుల్లో వీటిని పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికి 30 రోజులు పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు.
NTR: నందిగామలోని ఓ పత్రికా విలేఖరి వెలది సుగుణశేఖర్ రావుని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గురువారం పరామర్శించారు. గుండెపోటు కారణంగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.
కృష్ణా: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో విద్యార్థులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు రోడ్డు ప్రమాదాల పట్ల ఎలా అవగాహన కలిగి ఉండాలి, ఇతరులకు ఏ విధంగా సహాయపడాలని అనే అంశాలను ప్రదర్శన రూపంలో ప్రజలకు తెలిపారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనకు ప్రజలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ATP: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇల్లూరి నాగేంద్ర అలియాస్ ఉపేంద్ర తాడిపత్రిలో పలుచోట్ల సంచరిస్తున్నాడని, అతడిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు. సదరు వ్యక్తి కడప జిల్లాలో మూడు చోట్ల పలువురి పై దాడి చేసి డబ్బు, బంగారు నగలు, సెల్ ఫోన్లు లాక్కేళ్తున్నట్లు తెలిపారు.
SKLM: శ్రీకాకుళం నుంచి ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుంచి ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని ప్రకటించింది. ఈ బస్సు ద్వారా జగన్నాథ స్వామి, సూర్య దేవాలయం, లింగరాజ్ ఆలయం, కుంభమేళా వంటి వాటిని సందర్శించవచ్చు.
ATP: బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటరమణుడి మూల విరాట్ను భక్తులు పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రావణి భక్తులతో కలిసి పల్లకీని మోశారు.