KRNL: ఈనెల 26న జిల్లాలోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాల్లో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
VZM: వీధులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక ఆకులరెల్లివీధిలో గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. అలాగే శక్తి మొబైల్ యాప్ను మహిళలు స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు.
VSP: మధురవాడ శిల్పారామంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయ శిల్పారామం పరిపాలనాధికారి రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘గగన సిరి డాన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు రూ.50 వేల విరాళం అందజేసినట్లు ఈవో రామకృష్ణ శనివారం తెలిపారు. పాణ్యానికి చెందిన వెంకట చంద్రశేఖర్ బాబు-విజయలక్ష్మి దంపతులు స్వామివారి ఇలవేల్పు కావడంతో విరాళం అందజేశారు. దాతలకు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేసి సత్కరించారు.
PLD: బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, రామాపురం పేరూరుపాడు, బొల్లాపల్లి, రేమిడిచర్ల తదితర గ్రామాలలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఒకరినొకరు ఆలింగణం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేశ శాంతి సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రకాశం: పెట్రోల్ బంకుల్లో క్యాన్లలో పెట్రోల్ నింపడం ఆపేయమని ఉత్తర్వులు వచ్చినట్లు కొండపి మండలం పెట్లూరు బంకు యజమాని వేణుగోపాల్ శనివారం తెలిపారు. రైతుల అవసరాలకు డీజిల్ మాత్రం క్యాన్లలో కొట్టవచ్చని నిబంధన ఉందన్నారు. పెట్రోల్ వాహనాలకు మాత్రం కొట్టమని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి ఆదివారం సైతం వసూళ్ల కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో పన్ను వసూళ్ల కేంద్రాలు పనిచేస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కృష్ణా: విశ్వనాథపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఊరటగా ఆదివారం మినుములు, పెసల కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ కనీస మద్దతు ధరల ప్రకారం నాణ్యత ఆధారంగా పంటలను స్వీకరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మినుములకు సుమారు రూ. 7,800, పెసలకు రూ. 8,700 పైగా ధరలు లభిస్తున్నాయని చెప్పారు.
GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం కానుకల హుండీల లెక్కింపు పూర్తైంది. హుండీల ద్వారా రూ.48,76,103, అన్నదాన హుండీ ద్వారా రూ.2,81,368 ఆదాయం వచ్చినట్లు ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గం రాముడిపాలెంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పొలాలను ఆయన పరిశీలించారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
KDP: టీం ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.
SKLM: మందస మండలం డిమిరియా గ్రామ సమీపాన గెడ్డలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు అంబుగాంకు చెందిన గుడియా జగన్నాథ్(47)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
GNTR: ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న డీఎస్ఆర్ కృష్ణకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పదోన్నతి కల్పించారు. వైస్ చాన్సలర్ కే. గంగాధర రావు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, ఓఎస్డీ రవికుమార్, ఇంజనీర్ రాజకుమార్ పాల్గొన్నారు.
BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రేపు యద్దనపూడి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యద్దనపూడి గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి.
PLD: ఆస్తి, అధికారంపై వ్యామోహం, తల్లీచెల్లెళ్లపై విద్వేషమే జగన్ నైజమని ఎమ్మెల్యే పుల్లారావు విమర్శించారు. బాబాయ్ హత్యతో లబ్ధి పొంది, ఆయన బిడ్డను వేధించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం తగదన్నారు. దేవుడితో ఆటలాడితే వైసీపీ నేతలకు తగిన శాస్తి తప్పదన్నారు.