ELR: చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పదిమంది లబ్ధిదారులకు రూ.5,12,252ల చెక్కులను అందించారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందజేయడం కోసం కృషి చేస్తుందని అన్నారు.
TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు ఈస్ట్ హరిజనవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లిపూడి బాలకృష్ణ (35) మనస్తాపానికి గురై స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
KRNL: రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఇవాళ మాధవరం నందు మీడియా సమావేశం నిర్వహించారు. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పారు.
VSP: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని బాధ్యతగా వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పిలుపునిచ్చారు. నగరానికి రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందని తెలిపారు. వాటర్ సెక్యూరిటీ ప్లాన్, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాలతో సరఫరా మెరుగుపరుస్తున్నామన్నారు. నీటి సంరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.
AKP: నక్కపల్లి మండలం చందనాడలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎస్పీ తుహీన్ సిన్హా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, భద్రత ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.
NTR: జి.కొండూరులో పశువుల యజమానులకు పోలీసు వారు హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలను శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పశువులను కాపల కాయకుండా రోడ్లపై వదిలేనచో, పశువులను బందిల దొడ్లకు తరలించి, కేసులు నమోదు చేస్తామని పోలీసు వారు తెలిపారు. పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే, పశువుల యజమానులపై కేసు నమోదు చేసి జైలుకు పంపబడునని తెలిపారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ ఏపీ మాజీ డీజీపీదొర మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని వారి నివాసానికి వెళ్లి, దొర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన సేవలు ఏపీ పోలీస్ శాఖకు చిరస్మరణీయమని కొనియాడారు
కోనసీమ: మండపేట విగ్రహాల సెంటర్ నామకరణలో రాజకీయం తగదని జాతీయ నాయకుల సెంటర్ విగ్రహాల కన్వీనర్ మందపల్లి రవికుమార్ పేర్కొన్నారు. మండపేట ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణా ప్రణాళికపై చర్చించారు. ఎప్పుడు కులమత విభేదాలు లేకుండా అందరూ సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పుకొచ్చారు.
ASR: గత రెండు రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కొయ్యూరు మండలంలోని శరభన్నపాలెం నుంచి చింతపల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీ వృక్షాలు కూలిపోయాయి. రహదారికి అడ్డంగా చెట్లు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు, వాహనదారులు తెలిపారు. చెట్లు అడ్డంగా ఉండడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు.
KKD: పెద్దిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. చిన్న బుల్లి (68) అనే మహిళ పొలంలో గేదేలు మేపుతుండగా కోతులు గుంపు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన ఆమె రక్త స్రావంతో తప్పించుకోవడానికు పరిగెడుతూ.. కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమె దగ్గర చేరుకునేసరికే మృతి చెందింది. కోతుల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చర్యలు చేపట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: శాంతిభద్రతల బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శనివారం గన్నవరం ఎయిర్పోర్ట్లో సమీక్ష నిర్వహించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ను రూ.3 కోట్లతో ఆధునిక G+3 భవనంగా నిర్మిస్తామని చెప్పారు. రామవరప్పాడులో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసి 9 గ్రామాలకు సేవలు అందిస్తామని వెల్లడించారు. CSR, NRI నిధులతో పనులు చేస్తామన్నారు.
KRNL: వైసీపీ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకుడు పెద్ద కొండయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఇవాళ కండువాలు కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పార్థసారథి సారథ్యంలోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు లక్ష్మారెడ్డి, హనుమయ్య, విశ్వనాథ్ రెడ్డి, బంగారయ్య తెలిపారు.
VZM: మెరకముడిదాం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో శనివారం శాఖల పనితీరుపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని, విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకి సూచించారు.
KDP: మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఎంతో కీలకంగా మారుతుందని జిల్లా రిమ్స్ ఎస్సై సుభాశ్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లాలోని శిల్పారామంలో సందర్శకులకు ఈ యాప్ ఆవశ్యకతపై ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ యాప్ ద్వారా లభించే సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించారు.
NDL: ప్యాపిలి మండలం పీఆర్ పల్లిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏపీ రైతు సంఘం నేతలు అరటి పంటను ఇవాళ పరిశీలించారు. యుద్ధ ప్రభావంతో టన్ను రూ.20 వేల ధర, రూ.4 వేలకే పడిపోయిందని పేర్కొన్నారు. కోతకు వచ్చిన పంటను అమ్మలేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.23 వేల గిట్టుబాటు ధర ఇచ్చి, డోన్ మార్కెట్ శీతల గోదాంలలో నిల్వ చేయాలని కోరారు.