SKLM: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (APWJS) రాష్ట్ర మహాసభలు 2026 జూన్ 6, 7వ తేదీలలో విశాఖపట్నం జిల్లాలో జరగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని APWJS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గురుగుబెల్లి అప్పలనాయుడు శనివారం ఆహ్వానించారు.
VSP: ఉత్తరాంధ్ర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది గ్లోబల్ డెస్టినేషన్గా మారుతోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన సీఐఐ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందన్నారు.
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, రామచంద్రాపురం ఇంఛార్జ్ డీఎస్పీ TSRK ప్రసాద్ శనివారం ద్రాక్షారామం పరిధిలోని ఆదివారపుపేట, YSR కాలనీల్లో భారీ ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. ప్రతి ఇంటిని కూలంకషంగా తనిఖీ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, వాడకం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడివారికి హెచ్చరించారు.
VZM: గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలకు పండిట్ దీన దయాల్ ప్రశిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడు అంశాలపై 24 గంటల్లో వివరించడం జరుగుతుందన్నారు. ఇందులో ఓబిసి జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేవుడుబాబు, భాస్కర్రావు పాల్గొన్నారు.
PLD: ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామ దేవత చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఆదివారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తిరుణాలను పురస్కరించుకొని శనివారం జల బిందెల ఊరేగింపు నిర్వహించారు. తిరుణాల ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారని పేర్కొన్నారు.
ASR: విధి నిర్వహణలో ఉండగానే మృతి చెందిన ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీ పరిధిలోని కే.కుమ్మరిపుట్టు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న బట్టి పార్వతమ్మ శనివారం మృతి చెందారు. పలువురు యూనియన్ నేతలు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
VZM: రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె రామతీర్థం ఆలయాన్ని సందర్శించి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రామతీర్థం కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి పనులను స్వయంగా పరిశీలించారు.
అన్నమయ్య: మంచి పోషక విలువలు ఉన్న పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉండగలమని విఆర్డియెస్ సురేంద్రారెడ్డి తెలిపారు. విఆర్డియెస్ సంస్థ ఆధ్వర్యంలో ఛైర్మన్ సురేంద్రారెడ్డి కుమారుడు భువన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టె, ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేశారు. నిరుపేదలకు సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
E.G: రాజానగరం(మం) రఘుదేవపురంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ‘మన ఊరు-మన ఎమ్మెల్యే-మన పల్లెబాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం పర్యటించారు. అనంతరం కూటమి నాయకులలతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుంచి అందుకున్న అర్జీలను విశితంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం దిగోమెట్ట అటవీ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: యువకుడు అనుదీప్ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా ఎస్పీకి సూచించారు. చాట్రాయిలో చెరువులో పడి మరణించిన అనుదీప్ కుటుంబ సభ్యులను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, అనుమానాలకు తావులేకుండా ఇతర ప్రాంత అధికారులతో ప్రత్యేక విచారణ చేయించాలని కోరారు.
AKP: పాయకరావుపేట మండలం పాల్తేరులో శనివారం శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రామాలయం ఆవరణలో పూజలు నిర్వహించి గ్రామస్తులు పెళ్లిరాట వేశారు. ఇందులో భాగంగా మహిళలు పసుపు దంచారు. ఈనెల 27న రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
NDL: వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారి పలుచోట్ల దెబ్బతింది. పొలాల నుంచి వచ్చే నీటిజోము రోడ్డుపైకి చేరడంతో దారి మురికిగా మారి రాకపోకలు కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. రైతులు పంట పొలాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారి పక్కన కాలువలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఇవాళ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
E.G: ఇటీవల హాస్పటల్స్లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న ఐదుగురికి రూ.10,47,292లు CMRF నుంచి మంజూరు అయ్యింది. కాగా, ఆ చెక్కులను శనివారం మండపేట TDP కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు.
KRNL: ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన హాలహర్వి మండలం కొక్కరచేడు గ్రామంలో చోటుచేసుకుంది. కొక్కరచేడు గ్రామానికి చెందిన బోయ గోవిందు, మాదిగ హనుమంతు, దేవరాజు, తదితరులకు సంబంధించి తమ పాడి పశువుల కోసం సుమారు లక్ష రూపాయలు విలువైన పశుగ్రాసం నిల్వ చేసుకున్నారని, ఇవాళ ఆకస్మికంగా మంటలు చెలరేగి పశుగ్రాసం మొత్తం కాలిపోయిందని స్థనికులు తెలిపారు.