• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు’

SKLM: రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అరసవిల్లిలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నేటి రాత్రి నుంచి శ్రీ అరసవిల్లిలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

February 3, 2025 / 05:18 PM IST

‘చీపురుపల్లి ఎమ్మెల్యేని పరామర్శంచిన మంత్రి’

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

February 3, 2025 / 05:17 PM IST

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి

VZM: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూటమి ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసినాయుడు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. మూడో విడతలో ప్రభుత్వం ఇవ్వనున్న నామినేటెడ్ పదవుల్లో మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

February 3, 2025 / 04:49 PM IST

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..  8న 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. అలాగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

February 3, 2025 / 04:43 PM IST

శ్రీ పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమం

NLR: అల్లూరు పట్టణంలోని శ్రీ పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు సోమవారం చేపట్టారు. దాదాపుగా ఎనిమిది నెలలకు గాను రూ.4,69,840 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి, దేవస్థాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 3, 2025 / 04:03 PM IST

‘కూటమి పాలనలో దిగజారుతున్న తిరుపతి ప్రతిష్ట’

CTR: కూటమి పాలనలో తిరుపతి ప్రతిష్ట దిగజారుతున్నట్టు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడటం, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇలా జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో? తెలుస్తోందన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

February 3, 2025 / 03:50 PM IST

‘ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యదాయకం’ 

CTR: ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యదాయకమని IB PRP భువనేశ్వరి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం అవరణంలో రైతు సాధికార సంస్థ వారిచే ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో హానికర క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు.

February 3, 2025 / 03:06 PM IST

వెంకటేశ్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే థామస్

CTR: ఎస్ఆర్ పురం ఘటనలో మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

February 3, 2025 / 03:00 PM IST

రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.

February 3, 2025 / 02:59 PM IST

అప్రెంటిస్ షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఒక ఏడాదిపాటు గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. గ్రాడ్యు యేట్-19, డిప్లమా- 7 మొత్తం 27 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా వెల్లడించింది.

February 3, 2025 / 02:46 PM IST

ప్రేమ పేరుతో మోసం.. కేసునమోదు

NTR: ప్రేమిస్తున్నానని నమ్మించి ఇంటర్ విద్యార్థినిని మోసగించిన సహ విద్యార్థిపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో బాలికను శారీరకంగా లొబరుచుకొని, మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడపడంతో బాలిక ఆత్యహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెెలియాల్సి ఉంది.

February 3, 2025 / 01:48 PM IST

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు

KNRL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వసంత పంచమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనానికి వివిధ ఫలాలతో పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బృందావనానికి పూలు బంగారు కవచాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.

February 3, 2025 / 12:45 PM IST

యురేనియం తవ్వకాలతో వాతావరణ కాలుష్యం

KNRL: దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాల వల్ల వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు VS.కృష్ణ, కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు కప్పట్రాళ్లలోని గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. నీరు, గాలి కలుషితమవటం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

February 3, 2025 / 12:30 PM IST

‘హోంగార్డులు ప్రజలకు మెరుగైన సేవలు చేయాలి’

కడప: జిల్లాలోని ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానం నందు సోమవారం హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డులతో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అభినందనీయమని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.

February 3, 2025 / 11:16 AM IST

హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఎన్నికల అధికారి రమేష్ గెలిచినట్లు ప్రకటించారు.

February 3, 2025 / 11:15 AM IST