PLD: వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సివిల్స్ అభ్యర్థుల కోసం 30 నెలల ఉచిత శిక్షణ పథకాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళా అభ్యర్థుల్లో 10 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి, ఉచితంగా కోచింగ్, వసతి, భోజన సదుపాయాలు అందించబడతాయని ఆయన తెలిపారు.