సత్యసాయి: సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారంపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీయింగ్పై సమగ్ర విచారణ చేపట్టాలని డీఎంఈ డాక్టర్ నరసింహంను ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఏ స్థాయిలో అధికారులు సహకరించారు? అన్న అంశాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు.