PLD: ఈపూరు మండలం బద్రుపాలెంలో పిండి ముసలయ్య అనే టీడీపీ కార్యకర్త ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు అందజేయడం దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేదన్నారు.
BPT: రేపల్లెలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 11కేవీ టౌన్ 5వ ఫీడర్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. దీంతో పీటేరు రోడ్డు, అంకమ్మ చెట్టు, పెద్ద మసీదు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, అలీ నగర్, తాలూకా ఆఫీసులు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదని డిప్యూటీ ఈఈ శ్యామ్ సుధాకర్ బాబు చెప్పారు.
GNTR: మంగళగిరిలో లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు శనివారం అకస్మిక తనిఖీలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఎస్సై వెంకట్ ఈ తనిఖీలు చేపట్టారు. గదుల కేటాయింపు, ఐడీ కార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. లాడ్జీల్లో పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.
GNTR: మంగళగిరిలో లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు శనివారం అకస్మిక తనిఖీలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఎస్సై వెంకట్ ఈ తనిఖీలు చేపట్టారు. గదుల కేటాయింపు, ఐడీ కార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. లాడ్జీల్లో పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.
TPT: టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ నేత శ్యామల ఆరోపించారు. గోవుల మరణాలు, కొండపై మద్యం లభ్యత, తొక్కిసలాటలో భక్తుల మృతి వంటి ఘటనలపై ఆమె ధ్వజమెత్తారు. క్యూలైన్లలో భక్తులకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని విమర్శిస్తూ.. “మీ వీడియోలు బయటకొస్తే తప్పేంటి?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KRNL: మద్దికేర సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. ఇవాళ వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని, అర్హులైన దివ్యాంగులు తమ పరిధిలో ఉన్న సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీన ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేసుకోవచ్చని సూచించారు.
VSP: భైరవస్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం అధికారులను ఆదేశించారు. ఆలయానికి వెళ్లే రోడ్డును మెరుగుపరచడంతో పాటు, భక్తులకు తాగునీరు, టాయిలెట్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గ్రాండ్ ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం భైరవస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
TPT: ఇవాళ రేణిగుంటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి BJP పార్టీ ఇంఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యకర్తలతో కలిసి పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ చరిత్ర, సైద్ధాంతిక పునాది కాలాంశాలను శిక్షణార్థులకు వివరించారు.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకరును సిద్ధవటం ఏఎస్సై సుబ్బరామచంద్ర ఆధ్వర్యంలో ఇవాళ రాత్రి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్సై మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు స్పీడ్ బ్రేకరును శాశ్వతంగా తొలగింపు చేపట్టామని తెలిపారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు పంచాయతీ రాయుడుపాకలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ పునర్మాణం, రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు పాల్గొన్నారు.
ASR: పాడేరులోని ముఠా కళాశీల కూలిరేట్లు పెంపుపై శనివారం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ టీ.సూర్యనారయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి సుందరరావు తెలిపారు. సిమెంట్, ఐరన్ వర్తకుల సంఘం, ముఠా కళాశీల కార్మిక సంఘం మధ్య ఒప్పందం జరిగిందన్నారు. గతంలో కంటే 20శాతం కూలిరేట్లు పెంచడం జరిగిందన్నారు.
KRNL: ఈనెల 24న నిర్వహించనున్న CPI ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఇంటి స్థలం లేని పట్టణ పేదలకు 2 సెంట్ల ఇంటి జాగా ఇవ్వాలన్నారు.
SS: నల్లమాడ(మం) దొన్నికోట పంచాయతీ సుబ్బరాయునిపల్లిలో పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.
కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడులో 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రహదారి సమస్యకు MLA యార్లగడ్డ వెంకట్రావు శ్రీకారం చుట్టారు. కట్టపై బీటీ రోడ్డు పనులను ప్రారంభించి పురోగతిని ఆయన శనివారం పరిశీలించారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని చెప్పారు. సమస్య పరిష్కారం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. పార్టీ సహచర నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.