కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.
TPT: సూళ్లూరుపేటలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. సత్యం జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 233 మంది విద్యార్థుల్లో 227 మందిని ఒకే ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి కేటాయించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కొన్ని పాఠశాలలు పట్ల వివక్షత చూపుతున్నరన్నారు.
KDP: బద్వేల్లో మొదటి రోజు ప్రశాంతంగా పూర్తయిన ఇంటర్ పరీక్షలు ఎస్కేపి జూనియర్ కళాశాల, గౌతమ్, బీజేఎస్ఆర్, శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై నాగ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసుల సీసీ కెమెరాల నిఘా ఉంచారు.
TPT: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా వరదరాజ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వైద్య సిబ్బంది, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ఇద్దరు హిజ్రాలకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతపురానికి చెందిన శాంతి, కూడేరుకు చెందిన ఆద్య ఈ కార్డులను అందుకున్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న హిజ్రాలందరికీ తక్షణమే ఐడి కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
VZM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన చీపురుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఏర్పాట్లను, మీటింగ్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ, మండల అధికారులు పాల్గొన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మల్ల ధనలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు తెలిపారు.
AKP: రాంబిల్లి మండలం సీతంపాలెంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ASR: డుంబ్రిగుడలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు రెండు రోజుల రిలే నిరాహార దీక్ష ఇవాళ చేపట్టనున్నారు. ఈ దీక్షకు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ELR: DCMS ఏలూరు నిత్యవసర సూపర్ మార్కెట్లో వేరుశనగ నూనె కిలో 300 పప్పునూనె (నువ్వులు) కిలో 370లకు లైవ్లో అందుబాటులో ఉందని డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. కావున ప్రజలందరూ నిత్యవసర సరుకులు, నూనెలు తక్కువ ధరకు లభించునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుణ్ణంపల్లి సొసైటీ ఛైర్ పర్సన్ అక్కి శెట్టి సాయి సుధాకర్ పాల్గొన్నారు.
SKLM అంగన్వాడీల వేతనాల పెంపు, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంపు కోరుతూ మార్చి 2న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఇటీవల విధుల్లో చేరిన 12 మంది పారిశుద్ధ్య కార్మికుల పేర్లను మూడు నెలలు గడిచినా ఆప్కాస్లో ఆన్లైన్ చేయలేదని AITUC నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే పేర్లు ఆన్ లైన్ చేసి, మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.
TPT: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్ మాండ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ATP: MLA పరిటాల సునీత ఆదేశాలతో చిన్నంపల్లి పంచాయతీ అన్నే ఫెర్రర్ కాలనీలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష కోచింగ్ సెంటర్ నందు చదువుతున్న వారికి మాజీ మండల కన్వీనర్ మారినేని లక్ష్మీనారాయణ తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
KRNL: నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచాపురం సర్పంచ్ వై. జయమ్మ పాల్గొన్నారు.