• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దారుణం.. భర్తను గొడ్డలితో నరికిన భార్య

KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:45 AM IST

లక్కీరెడ్డిపల్లి గంగమ్మ తల్లి హుండీ ఆదాయం రూ. 17, 96, 420

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతర 3 రోజుల హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. ఈ లెక్కింపు ప్రకారం మొత్తం  రూ.17, 96,420 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు ఇచ్చిన సహకారం ఆలయ నిర్వహణకు, పూజా కార్యక్రమాల కోసం ఉపయోగపడనుందని ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు.

February 20, 2026 / 04:34 AM IST

నందవరం పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

KRNL: నందవరం SC కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో పుల్లయ్య తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తోందని, ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్, హోమ్ డెలివరీ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

February 20, 2026 / 04:27 AM IST

పత్తికొండలో కిసాన్ పథకం నమోదు కీలకం

KRNL: పత్తికొండ మండలంలో రైతు విశిష్ట సంఖ్య ఉంటేనే కిసాన్ పథకం వర్తిస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకట్రాముడు బుధవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 2,143 మంది రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. నమోదు లేని రైతులు వెంటనే తమ గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.

February 19, 2026 / 10:15 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇరువురికి తీవ్ర గాయాలు

CTR: సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు చౌడేపల్లిగా స్థానికుల చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 19, 2026 / 10:05 AM IST

యనమలకుదురు ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు

కృష్ణా: యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 82 రోజుల కాలానికి హుండీ ఆదాయం మొత్తం రూ.23,40,500గా వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. భవాని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యనమలకుదురు శాఖ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

February 19, 2026 / 10:00 AM IST

జిల్లాలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

CTR: జిల్లాలో ముస్లింలు ఇవాళ ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

February 19, 2026 / 09:37 AM IST

వరకట్న వేధింపులు.. భర్తకు జైలు శిక్ష

తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో భర్తకు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిపల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2013లో వివాహం తర్వాత వేధింపులు పెరగడంతో బాధితురాలు 2018లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ఆరోపణలు నిరూపితమవడంతో నిన్న కోర్టు తీర్పునిచింది.

February 19, 2026 / 09:02 AM IST

‘అక్రమ కుళాయిల కనెక్షన్ తొలగిస్తాం’

NLR: బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 9,632 గృహాలు ఉండగా 4,201 కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు ఉన్నాయని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రత్యేక డ్రైవ్‌లో వాటిని గుర్తించామని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడతామని నగర కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు.

February 19, 2026 / 09:00 AM IST

‘అక్రమ కుళాయిల కనెక్షన్ తొలగిస్తాం’

NLR: బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 9,632 గృహాలు ఉండగా 4,201 కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు ఉన్నాయని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రత్యేక డ్రైవ్‌లో వాటిని గుర్తించామని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడతామని నగర కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు.

February 19, 2026 / 09:00 AM IST

కొమరోలు మండలంలో పంటల పరిశీలన

ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

February 19, 2026 / 08:10 AM IST

కొమరోలు మండలంలో పంటల పరిశీలన

ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

February 19, 2026 / 08:10 AM IST

జిల్లాలో క్రీడల ప్రోత్సాహానికి కృషి: ఎంపీ

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరుగుతున్న అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను రాత్రి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తిలకించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ టీమ్ క్రీడాకారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. జిల్లాలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.

February 19, 2026 / 07:50 AM IST

జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు

కోనసీమ: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు ప్రధానంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

February 19, 2026 / 07:20 AM IST

‘రంజాన్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి’

ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.

February 19, 2026 / 07:07 AM IST