W.G: భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అపురూప దృశ్యం అవిష్కృతమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం, మీన సంక్రమణం వేళ శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. శ్రీరామననమి పర్వదినం నాడే ఈ విశేషం జరగడంతో భక్తులు పులకించిపోయారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.