ATP: ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో స్వయం సమృద్ధి సాధించాలని కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది చేతివృత్తి కళాకారులకు పనిముట్లు, పరికరాలను పంపిణీ చేశారు.