ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలపై అమర్చిన నిబంధనలకు విరుద్ధమైన ఎల్ఈడీ లైట్లను తొలగించారు. ఎస్సై మాట్లాడుతూ.. అనుమతి లేకుండా అధిక వెలుతురు ఇచ్చే ఎల్ఈడీ లైట్లు వాడటం వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు.