PLD: చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ తాగునీటి సమస్యను ఎదుర్కోలేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో ఎటువంటి రాజీ పడలేదని పేర్కొన్నారు. పట్టణ శివారులోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకుల్లో నీటిని నింపే పనులను శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.