CTR: జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ను జనసైనికులు కలసి ఘనంగా సత్కరించారు. పార్టీకి విశేష సేవలందించిన ఆయనకు గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, ప్రజలకు మేలు చేసే దిశగా కృషి చేయాలని హరిప్రసాద్ పిలుపునిచ్చారు.