KKR కెప్టెన్ అజింక్య రహానే IPLలో 200 మ్యాచ్ల మైలురాయిని చేరుకున్నాడు. SRHతో జరిగిన మ్యాచ్తో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా నిలిచాడు. 2008లో అరంగేట్రం చేసిన రహానే, 18 ఏళ్ల ప్రయాణంలో 2 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 5099 పరుగులు చేశాడు. ధోని, రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాల సరసన రహానే చేరడం విశేషం. ఇప్పటివరకు అతడు మొత్తం ఐదు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.