ELR: అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ వద్దగల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఇంఛార్జి కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడటంతో పాటు అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడని పేర్కొన్నారు.
ASR: గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలోని పారిశుద్ధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్న పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో కురుస్తున్న వర్షాలకు అది మొత్తం తడిసిపోయి దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
GNTR: అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఉండవల్లిలో మంత్రి లోకేష్ ఆయన చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన దేశ సేవను, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషిని గుర్తుచేశారన్నారు. అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమని లోకేష్ అన్నారు.
ELR: ఉంగుటూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం నందు గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలుగా ముందుగా రక్తదానం చేయడం జరిగింది. తొలిత అంబేడ్కర్ విగ్రహానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు.
PPM: పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలాల్లో వివిధ గ్రామాల్లో మొక్కజొన్న ధర నేల చూపు చూస్తోంది. పది రోజుల వరకూ క్వింటాల్ రూ. 2,400 వరకూ ఉండగా ప్రస్తుతం రూ. 2 వేలు పలుకుతోంది. మరింతగా ధర తగ్గుతుందని వ్యాపారులు అంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ .2,225 ప్రస్తుతం ఉంది.
కృష్ణా: చల్లపల్లిలో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకళ్ళ జగన్నాధరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు విచ్చేసి శంకుస్థాపన చేశారు.
BPT: బల్లికురవ మండలం వి.కోప్పెరపాడు పరిధిలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పత్తి వేసిన దశలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలకూలిపోయింది. ఒక్కో ఎకరానికి సుమారు రూ.30,000 పైగా ఖర్చుపెట్టినట్లు రైతులు వాపోయారు. సుమారు 30 నుంచి 50 ఎకరాల మేర పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.
GNTR: గుంటూరులో జపాన్కు చెందిన డాక్టర్ మావోటో హబారా, వైద్యులు హరిత, శివప్రసాద్ బృందం కలిసి మూడు సంక్లిష్ట కార్డియాక్ కేసులను విజయవంతంగా నిర్వహించారు. బైపాస్ సర్జరీ చేసిన మహిళకు ప్రధాన ధమనిలో బ్లాకేజ్ ఉండగా, మరో రోగిలో తీవ్ర కాల్షియం నిక్షేపాలు గుర్తించారు. ఒక రోగికి CABG సర్జరీ సాధ్యపడకపోయినా రోటాబ్లేషన్, స్టెంటింగ్ ద్వారా చికిత్స అందించారు.
ELR: ప్రతి పోలీస్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి, సమానత్వం, న్యాయం, విద్యకు హక్కు కోసం ఎంతో కృషి చేశారు అన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామంలో రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం జెసిబి సహాయంతో స్థానిక యువకులు తొలగించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో తమ సొంత నిధులతో ఈ పనులు చేపట్టడం జరిగిందని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ASR: కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని చిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయి, చెల్లాచెదురు అయ్యాయని వార్డెన్ రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగుమిల్లి, లక్ష్మీపురం, కొయ్యలగూడెం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం కొయ్యలగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బాలరాజు పాల్గొంటారన్నారు.
PPM: సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్లో మెగా వాలీబాల్ టోర్నీను ఆదివారం పాలకొండ డీఎస్పీ రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి బహుమతి విజేతలకు రూ.5,000, 8 డ్రస్సులు, షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్సై ఎస్కే మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సీఐ చంద్రమౌళి, సీతంపేట ఎస్సై, అమ్మన్న రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ELR: టి.నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. శ్రీనును అరెస్ట్ చేసి, అతని వద్ద ఉన్న 6 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ చేసినా విక్రయించినా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ అశోక్ హెచ్చరించారు.
KRNL: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.