E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. APSSDC సహకారంతో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో సుంకుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రస్థాయి పాల పండ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. కోడుమూరు వృషభాలు ప్రథమ, ప్రకాశం జిల్లా ద్వితీయ, సీసంగుంటల తృతీయ, మంత్రాలయం-బేతంచెర్ల నాల్గవ, మాధవరం ఐదవ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు రూ.40 వేల నుంచి రూ.10 వేల వరకు బహుమతులు అందజేశారు.
SKLM: పోలాకి మండల కేంద్రంలో నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన శనివారం రాత్రి పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లిలో మార్చి 23న జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
NLR: సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సై రాజేష్ వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, ఫైన్లు విధించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామానికి వెళ్లి హనుమంతరాయ చౌదరి భౌతిక దేహానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
W.G: తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారికి వేలాది మంది మహిళలతో మంగళ హారతులు ఇచ్చి ఇవాళ రాత్రి గ్రామ సేవ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వెయ్యి మంది కళాకారులతో ఈ ఆఖరి రోజు ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖులు, రాజకీయ నేతలు అమ్మవారి రధాని లాగుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ELR: ఈనెల 23న జరుగుతున్న చలో విజయవాడ ప్రదర్శన, మహా ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఐఎన్టీయూ ఏలూరు నగర అధ్యక్షులు బి.సోమయ్య పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లాలో చలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా ఉన్నాయన్నారు.
CTR: నగరి మున్సిపాలిటీ పుదుపేటలో జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలుపుతూ.. రంజాన్ నెలలో పాటించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనిషిలో సహనం, దాతృత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి వద్ద ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుడ్డారెడ్డిగారిపల్లి సమీపంలో కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన నాగబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థనికులు అతన్ని వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సంబేపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని పలు హోటల్స్లో ఇవాళ విజలెన్స్ అధికారులు ఆక్షస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 13 డొమస్టిక్ సిలెండర్లను సీజ్ చేసి, గ్యాస్ గోడౌన్కు తరలించారు. అక్రమ గ్యాస్ వినియోగాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ అధికారులు సింహాచలం, సతీష్ కుమార్, CSDT సాయికృష్ణ సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.
KRNL: కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో, ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో అధికారులు ట్రాఫిక్ నిబ౦ధనలు, హెల్మెట్ వాడకం, మైనర్లు వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
SS: చిలమత్తూరు మండలం లాలేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం ఈ నెల 24న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు చిన్నన్నపల్లికి చెందిన రమేష్ రెడ్డి రామాలయానికి ఎలక్ట్రానిక్ కంచు డోలు, వాయిద్యాన్ని శనివారం రాత్రి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా లాలేపల్లి గ్రామస్తులు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
PLD: పెదకూరపాడులో సీఎం సహాయనిధి కింద 11 మంది లబ్ధిదారులకు రూ.10.61 లక్షల చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అందజేశారు. ఈ నిధి నిరుపేదలకు వరంగా మారిందని ఆయన అన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలో వందలాది మంది మెరుగైన వైద్యం పొందుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు: జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. శనివారం ఆయన గుంటూరు సివిల్ సప్లైస్ ఎల్పీజీ ఏజెన్సీని తనిఖీ చేశారు. కనెక్షన్లు, బుకింగ్స్, సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు అనవసర ఆందోళనతో ముందుగానే గ్యాస్ బుక్ చేసుకోవద్దని జేసీ సూచించారు.
ప్రకాశం: హనుమంతుడుపాడు మండలం పరిధిలోని వేములపాడు రోడ్డులో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా శనివారం ఎస్సై మాధవరావు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలను గుర్తించి ఈ-చలాన్లు విధించారు. ఈ తనిఖీల ద్వారా వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.