KKD: కరపలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి ఓ ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వారికి, ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప: గత వైసీపీ హాయంలో తన నియోజకవర్గంలో భూ అక్రమాలపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి కోరారు. కడప కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత రెడ్డి దృష్టికి పలు అంశాలను తీసుకుని వచ్చారు. అసైన్డ్ భూములను సైతం ఆక్రమించుకున్నారని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ: రామచంద్రపురం పట్టణం చప్పిడి వారిసావరం, హౌసింగ్ కాలనీలలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనల మేరకు మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అబ్జర్వర్ కాకినాడ రామారావు MLC అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
కోనసీమ: అమలాపురం రూరల్ మండల పరిధిలోని భట్నవిల్లిలో వాహనదారులకు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై సీఐ ప్రశాంత్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని జాతీయ రహదారి పక్కన నిలిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు.
W.G: పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ పరిశోధన సంస్థ సహ సంచాలకులు శ్రీనివాస్, హైదరాబాద్కు చెందిన డిబుల్ అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్లో డిగ్రీ లేదా డిప్లామో చేసిన వారు అర్హులన్నారు.
VZM: ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని CITU జిల్లా కార్యదర్శి జగన్మోహన్ మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు యాప్లను రద్దు చేసి పని భారం తగ్గించాలని స్దానిక రూరల్, అర్బన్ ప్రాథమిక కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలతో వెట్టి చాకిరి చేపట్టించుకుని కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
కోనసీమ: రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో MLC ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల అభ్యర్థిని గెలుపుంచు కోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.
KKD: జిల్లా నూతన ఎస్పీ బిందు మాధవ్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన నాయకులు డా బి ఎన్ రాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిస్థితులు తెలియజేసి జిల్లాలో దళితుల పై జరిగే దాడులను అరికట్టాలని, అలాగే యువత పై గంజాయి ప్రభావం విపరీతంగా ఉందని దాని కట్టడి పై దృష్టి సారించాలని కోరారు.
E.G: రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జీరో శాతం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రాజమండ్రిలో ఎన్ హెచ్ అధికారులు, గామన్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ మాట్లాడుతూ.. బ్రిడ్జి రోడ్డుపై ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని, గోతులు లేకుండా చూడాలని సూచించారు.
GNTR: శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. సచివాలయ కార్యదర్శులు ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాద్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కమిషనర్ నల్లపాడు శ్రీనివాస కాలనీ నివాసితులు మౌలిక వసతులు కోరుతూ అందించిన అర్జీ మేరకు సదరు కాలనీ, ప్రాంతాల్లో పర్యటించారు.
ATP: గుంతకల్లులో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు గత పది రోజుల నుంచి ఇంటింటి నుంచి చెత్త సేకరించడం లేదన్నారు.
ATP: రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం కార్మికుల సమస్య గోడు పట్టించుకోని సూపరింటెండెంట్ అవసరమా అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రస్తుత సూపరింటెండెంట్ వైఖరిని మల్లికార్జున తప్పు పట్టారు. అలాగే, సెక్యూరిటీ గార్డ్ రవిని తక్షణమే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ATP: గుంటూరులో వృద్ధురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళవారం అనంతపురం జిల్లా గుత్తిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం, విజయ్ మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ATP: గుంతకల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి రూ. 90 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తిమ్మాపురం శివాలయానికి, నల్లదాసరపల్లి, చింతలంపల్లి, దోసలోడికి సుంకులమ్మ దేవాలయాలకు, పామిడి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఓబులాపురం ఆంజనేయస్వామి దేవాలయాలకు ఈ నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
VZM: గజపతినగరంలోని జాతీయ రహదారి పక్కన గల సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి ఆలయం పై వేంచేసి ఉన్న ఉష ఛాయ పద్మిని సమేత సూర్య నారాయణస్వామి వారికి విశేష క్షీరాభిషేకం జరిపారు. మంగళవారం రథసప్తమి పురస్కరించుకొని సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.