KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహబూబ్ సుభాన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. గంజహళ్లి ఉరుసు మహోత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.