BPT: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని చేబ్రోలు మండల వ్యవసాయ అధికారిణి ప్రియదర్శిని సూచించారు. నారాకోడూరులో శుక్రవారం పెసర కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకునే రైతులు ఈకేవైసీ చేయించుకుని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బంది, పాల్గొన్నారు.