KDP: పులివెందులలోని స్థానిక శిల్పారామం పార్క్కు వెళ్లే రోడ్డులో నిన్న రాత్రి కారు ఢీకొని బాలుడు జస్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు పులివెందులకి చెందిన శ్రీనివాసులు ఇటుకల బట్టిలో పని చేస్తున్నాడు. జస్వంత్ను ఇటుకల బట్టీ వద్దకు రమ్మని కోరగా అక్కడికి వస్తుండగా కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే జస్వంత్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.