KDP: ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయని పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయ మాడ వీధులు, ఆలయ పరిసరాలను ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని షాపుల యజమానులకు సూచించారు. అదేవిధంగా మాడవీధులను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.