అన్నమయ్య: నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం చింతకాయలు కోయడానికి చెట్టెక్కిన రైతు కలీల్ (58) ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గారబురుజుకు చెందిన రైతు తన గ్రామ సమీపంలోని చింత చెట్టెక్కి కాయలు కోస్తుండగా అకస్మాత్తుగా జారి కిందపడటంతో అతనికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.