• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు.భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

February 23, 2026 / 01:32 PM IST

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్ల సందర్శన

సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల అమ్మకాల పరిస్థితిపై ఆరా తీశారు. చేనేత ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారుల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు ప్రోత్సాహం అందించారు.

February 23, 2026 / 01:31 PM IST

తొలిరోజు 635 మంది విద్యార్థులు గైర్హాజరు

ATP: జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు పరీక్షకు మొత్తం 22,848 మంది విద్యార్థులు కేటాయించబడగా, వారిలో 22,213 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

February 23, 2026 / 01:30 PM IST

క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతికి ఆర్థిక సాయం

కోనసీమ: కొత్తపేట మండలం బిల్లకుర్రు గ్రామానికి చెందిన ఇళ్ల దేవి శ్రీ గత కొన్ని రోజులుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ వైజాగ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్య చికిత్సకు ఆమె కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కామన్ మ్యాన్ సేవాదళ్ సభ్యులు స్పందించిన వెంటనే ఆమె కుటుంబాన్ని పరామర్శించి పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

February 23, 2026 / 01:28 PM IST

కల్తీ పాల ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన

E.G: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ సోమవారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు తక్షణమే అప్రమత్తమై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు.

February 23, 2026 / 01:24 PM IST

నూతన మఠాధిపతి కఠిన నిర్ణయాలు

కడప జిల్లా వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో నూతన మఠాధిపతి వీరధర్మజ వేంకటాద్రి స్వామి కఠిన నిర్ణయాలు ప్రకటించారు. సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి ఆదేశించి, నిర్లక్ష్యంపై హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్ మేనేజర్‌గా పిపిఎన్ ప్రసాద్‌ను ప్రకటించారు. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 23, 2026 / 01:23 PM IST

మొదటి రోజు 797మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో ఇంటర్ మొదటి సం. పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన పరీక్షకు 797మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 31014 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 30217 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.

February 23, 2026 / 01:22 PM IST

గుమ్మలక్ష్మీపురంలో ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం’ ప్రారంభం

PPM: గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కె. దీనమయ్య ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం’ జీపును జెండా ఊపి ప్రారంభించారు. వేసవి కాలంలో చేతి పంపుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో MPDO శ్రీనివాసరావు, RWS జేఈ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 01:20 PM IST

KGBV ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. KGBVలో చదువుతున్న విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలను ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి సర్టిఫికెట్లు సమయానికి జారీ కావడం అత్యంత అవసరమని అన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల సమస్యలను కూడా సభ దృష్టికి ఎమ్మెల్యే  తీసుకువచ్చారు.

February 23, 2026 / 01:20 PM IST

వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు

కృష్ణా: నేపాల్ రంగసాల ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి చెందిన పవర్ లిఫ్టర్ దుర్గా సత్యనారాయణ 66 కేజీల విభాగంలో 610 కేజీల బరువు ఎత్తి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ క్రమంలో ఆయనను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఇవాళ అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 01:20 PM IST

అసెంబ్లీలో మంత్రి నిమ్మల ప్రసంగం

W.G: అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదురు డ్రైన్ ముంపు సమస్యను ఆయన ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికంగా వరదలు రావడం వల్ల సమీపంలోని పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.

February 23, 2026 / 01:20 PM IST

‘చట్టసభల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

GNTR: చట్టసభల విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికతో సభకు హాజరుకావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.

February 23, 2026 / 01:15 PM IST

కల్తీ పాలు ఘటనపై పలివెల వీరబాబు ఆగ్రహం

E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక పరిహారం అందించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సేవలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

February 23, 2026 / 01:12 PM IST

సజావుగా ముగిసిన ఇంటర్మీడియట్ తెలుగు పరీక్ష

VZM: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలు కొత్తవలస భారత్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం సజావుగా జరిగింది. మొత్తం 297 విద్యార్థులు కేంద్రానికి కేటాయించగా, అందులో 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనారోగ్యానికి బారిన పడకుండా అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 01:10 PM IST

బందోబస్తు మధ్య తొలిరోజు ముగిసిన పరీక్ష

సత్యసాయి: ​ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు రాకుండా తనిఖీలు చేపట్టారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

February 23, 2026 / 01:10 PM IST