ATP: గుత్తి 220కేవి విద్యుత్ సబ్ స్టేషన్లో రిలే ప్యానల్స్ మారుస్తున్న నేపథ్యంలో గుత్తి ఆర్.ఎస్ ఫీడర్లో నేటి నుంచి ఈ నెల 8వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశముందని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. టెక్నికల్ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించాలని అధికారులు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన సీనియర్ నాయకుడు కురుబ మల్లన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో తనకు సముచితస్థానం కల్పించి, రాజకీయంగా ఎంతో ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ను తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు బుధవారం రాత్రి తుళ్లూరు మండలం, ఉద్దండరాయునిపాలెంలోని సురేశ్ నివాసంలో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా డైమండ్ బాబు నందిగం సురేశ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులు కలిసి పలు విషయాలపై చర్చించారు. కాగా ఇటీవలే నందిగం సురేశ్ జైలు నుంచి విడుదలయ్యారు.
E.G: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ క్రికెట్, వాలీబాల్ కిట్లు, క్రీడా ప్రాంగణానికి మూడు డే లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గ్రామ యువకులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ATP: గుంతకల్లు మీదుగా కుంభమేళాకు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న తిరుపతి-దానాపూర్-తిరుపతి ప్రత్యేక రైలు(నెం 07117) రాత్రి 11:45 తిరుపతిలొ బయలుదేరి గుత్తి, గుంతకల్లు మీదుగా దానాపూర్ చేరనుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం 07118) ఈ నెల 17న దానాపూర్-తిరుపతి నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ATP: గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన రంగనాథ స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ హుండీ లెక్కింపు ఉంటుందని ఈవో రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులు వేసిన కానుకలకు దేవదయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వహకులు, అర్చకులు హాజరు కావాలన్నారు.
కడప: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ. 9,417 కోట్లు కేటాయించడం జరిగిందని ఆ శాఖ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం పట్ల జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత డా దాసరి రవిశంకర్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్ల అభివృద్ధి, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
కడప: సిమెంటు పైపుల స్థానంలో ఐరన్ పైపులను ఏర్పాటుచేసి సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు అందించాలని ఒంటిమిట్ట బీజేపీ మండల అధ్యక్షుడు ఆర్.భాను ప్రకాశ్ రాజు అన్నారు. బుధవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా పద్మావతి విశ్రాంతి గృహంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ను కలిశామన్నారు. నేతలు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు శివరాజు, తదితరులు పాల్గొన్నారు.
NLR: మర్రిపాడు మండలంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు బుధవారం ఆత్మకూరు సీఐ గంగాధరరావు, ఎస్సై కే.శ్రీనివాసరావు తెలిపారు. వారు వివరాలను వెల్లడించారు. దొంగల వద్ద నుంచి రూ. 8 వేలు చోరీ సొత్తు, చోరీకి ఉపయోగించిన ఫ్యాషన్ ప్రోమోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పలు స్టేషన్లలో వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు.
కడప: రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలసపాడుకు చెందిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బ్రహ్మానందరెడ్డి కోరారు. విజయవాడలో బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలిసి వినతిపత్రం ఇచ్చామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
కృష్ణా: నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైన పగడాల సత్యనారాయణను వర్కర్స్ అండ్ టైలర్ అసోసియేషన్ అభినందించింది. పగడాలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధికి, వృత్తిదారుల పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మంత్రి కొలుసు పార్థసారథి సారధ్యంలో అభివృద్ధి చూపుతామని పగడాల హామీ ఇచ్చారు.
గుంటూరు: ఘంటసాల మండలం చినకళ్లేపల్లిలో కాకతీయుల నాటి శిలాశాసనం బయటపడింది. చినకళ్లేపల్లికి చెందిన అంగత శిలాశాసనాన్ని ఫొటోలు తీయించి మైసూరు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు. మల్లయపెద్ది తన ప్రభువు ద్వారా 25 గొర్రెలు ఒకరికి ఇచ్చారు. ఈ గొర్రెలు వారసత్వం స్వామివారికి నిత్యం నెయ్యి ఇవ్వాలని రాసి ఉన్నట్లు అనుభవజ్ఞులు చెబుతున్నారు.
E.G: పెరవలి మండలం కానూరులో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉ.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరా బత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
E.G: రాజమండ్రి సిటీ ప్లానర్(CP) & డిప్యూటీ సిటీ ప్లానర్ (DCP) స్థానిక కోటగుమ్మం, ఏ.వి.ఏ రోడ్డును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణ తొలగింపు చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి నుండి ఆక్రమణ తొలగింపు చర్యలు ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.
EG: ఉమ్మడి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం Xలో పోస్టు చేసింది. “పల్లె పండుగ” ద్వారా గుంతలు లేని ఆంధ్రప్రదేశే లక్ష్యంగా సీఎం, డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారని పేర్కొంది. ఉమ్మడి జిల్లా పరిధిలో గత 4 నెలల్లో 1,756 రోడ్లను పూర్తి చేసినట్లు తెలిపారు.