E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక పరిహారం అందించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సేవలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.