CTR: కాణిపాక ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా స్వర్ణ రథోత్సవం జరిగింది. కాణిపాక ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు ఉదయం సంకటహర చతుర్థి నిర్వహించి, రాత్రి వేళలో స్వామివారిని బంగారు రథంపై ఊరేగిస్తారు. నిన్న రాత్రి జరిగిన కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈఓ పెంచల కిషోర్, అధికారులు పాల్గొన్నారు.