PLD: నాదెండ్ల మండలంలో 17 వేల ఎకరాల రైతుల భూములు నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పల్నాడు కలెక్టర్కి ఫోన్ చేసి వెంటనే స్పందన కోరారు. అధికారుల ఉదాసీనతను తప్పుబట్టి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. P-4 విధానాన్ని విజయవంతం చేయాలన్నారు.