GNTR: ఫిరంగిపురం నూతన సీఐగా కే.శివరామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి, అక్రమ బెల్ట్ షాపులు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.