• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేసిన ఎంపీ

KRNL: పేద కుటుంబాలకు CMRF పథకం భరోసాగా నిలుస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇశాళ కౌతాళం గ్రామానికి చెందిన పరిమళ బాయికి రూ.1,48,847, కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన బలరాముడుకు రూ.75,122 సీఏం సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయాన్ని పంచలింగాలలోని తన స్వగృహంలో ఎంపీ అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అన్నారు.

March 21, 2026 / 06:48 PM IST

డ్రోన్ నిఘాతో పేకాట రాయుళ్ల అరెస్ట్

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. లేపాక్షి మండల అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాన్ని ఎస్సై నరేంద్ర బృందం డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించింది. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.

March 21, 2026 / 06:46 PM IST

గొర్రెల కాపరులకు రూ. 7.14 లక్షల పరిహారం

ATP: కొండూపల్లిలో గతంలో కురిసిన వడగళ్ల వానకు గొర్రెలు కోల్పోయిన 15 మంది రైతులకు ప్రభుత్వం రూ. 7,14,000 నష్టపరిహారం మంజూరు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కాపరుల కష్టాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. 238 గొర్రెలు మరణించగా బాధిత కుటుంబాలకు ఈ సాయం అందింది.

March 21, 2026 / 06:44 PM IST

23న ఈ కార్యక్రమాలు రద్దు: కలెక్టర్

KKD: ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 21, 2026 / 06:43 PM IST

‘కౌలు రైతును ఆదుకోవాలి’

KRNL: పత్తికొండలో కౌలు రైతును ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదోని రోడ్డులోని కౌలు రైతు పక్కీరప్పకు చెందిన రూ 5 లక్షలు విలువ చేసే పశుగ్రాశం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న రామచంద్రయ్య ఇవాళ కౌలు రైతును పరామర్శించారు.

March 21, 2026 / 06:43 PM IST

‘స్టీల్ ప్లాంట్‌తో లక్షలాది మందికి ఉద్యోగాలు’

VZM: బొండపల్లి మండలం దేవుపల్లిలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్’ ఏర్పాటుతో జిల్లా దశ మారుతుందన్నారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 23న ప్లాంట్‌కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.

March 21, 2026 / 06:42 PM IST

వరి రైతులకు ఏవో సూచనలు

E.G: గోకవరం మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో దాళ్వా వరి పంటకు మాగుడు, మానిపండు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని మండల వ్యవసాయాధికారి పీ. రాజేశ్వరి హెచ్చరించారు. గింజ పాలు పోసుకునే దశలో ధాన్యం రంగు మారకుండా ఉండాలంటే, నివారణకు ఎకరానికి 200 మి.లీ. ప్రాపిక్రోనజోల్ పిచికారీ చేయాలని ఆమె సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాలని కోరారు.

March 21, 2026 / 06:41 PM IST

పేకాట శిబిరంపై పోలీసులు దాడి

కోనసీమ: అమలాపురం(మం) కామనగరువు గ్రామ శివార్లలో పేకాట శిబిరంపై రూరల్ ఎస్సై శేఖర్ బాబు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జూదగాళ్ళను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 52 పేకాట కార్డులతో పాటు రూ. 4,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని తేల్చి చెప్పారు.

March 21, 2026 / 06:39 PM IST

నాయుడుపేటలో CM పర్యటన ఖరారు

TPT: ఈనెల 30న  చంద్రబాబు నాయుడుపేట పర్యటన ఖరారు అయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ టూర్‌ను ఈసారి ఫైనల్ చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు, కో-ఆర్డినేటర్ బృందం సమీక్షిస్తున్నాయి. పూదూరు సమీపంలోని టిడ్కో గృహ సముదాయం, ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

March 21, 2026 / 06:36 PM IST

వైసీపీ ఎస్సీ విభాగ పరిశీలకురాలు నియామకం

VSP: వైసీపీ ఎస్సీ విభాగ పరిశీలకురాలిగా గండి భాగ్యవతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు కేకే రాజును కలిశారు. ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి వార్డు, సచివాలయం స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలని కేకే రాజు ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.

March 21, 2026 / 06:31 PM IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలం కోనయాపాలెం సొసైటీలో రైతుల అభివృద్ధి, వ్యవసాయ బలోపేతానికి పెద్దపీట వేస్తూ రూ.1.30 కోట్ల రుణ పంపిణీ చెక్కులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు పంపిణీ చేశారు. రైతే దేశానికి వెన్నెముక అని, రైతు అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని కోరారు.

March 21, 2026 / 06:30 PM IST

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

CTR: తవణంపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. వెంగంపల్లి, గోవిందరెడ్డి పల్లె, ఏ గొల్లపల్లె గ్రామాలలో నూతన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఏ గొల్లపల్లిలో స్మశాన వాటిక ప్రహరీని ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.

March 21, 2026 / 06:29 PM IST

బీజేపీ కార్యాలయంలో SIR సన్నాహక సమావేశం

అనంతపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు రాజేష్ కురుబ అధ్యక్షతన SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు సందిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులకు రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

March 21, 2026 / 06:28 PM IST

రాయచోటిలో ఆర్యవైశ్య మహిళలకు వడి బియ్యం పంపిణీ

అన్నమయ్య: రాయచోటి వాసవి క్లబ్ వనితల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, 111 మంది ముత్తయిదువులకు వడి బియ్యం అందజేశారు. ముందుగా అమ్మవారికి ఒడిబియ్యం కట్టి అనంతరం మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షురాలు మాధవి లత, ప్రస్తుత అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఈ సేవా కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు.

March 21, 2026 / 06:27 PM IST

ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు

VZM: పశ్చిమాసియాలో యుద్ధం సమసిపోయి, ప్రపంచంలో శాంతి నెలకొనాలని అంకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 30 రోజులు పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు శనివారం నెలవంక ఉషోదయంతో దీక్షను విరమించి రంజాన్ పండగను ఘనంగా జరుపుకొన్నారు. RTC కాంప్లెక్స్ సమీపంలో గల అతి పెద్ద ఈద్గాల్లో అందరూ కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు.

March 21, 2026 / 06:23 PM IST