విజయనగరం జిల్లాలో మహత్మాగాంధీ, జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న వేతనదారులంతా తమ గ్రామాల్లో వెంటనే పనులకు హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లోని 775 పంచాయతీల్లో పనులు ప్రారంభించామన్నారు. ప్రతిరోజూ 300 వేతనం పొందేలా పని చేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యతా ఇవ్వలన్నారు.
ATP: పెద్దపప్పురు మండలం చిన్నపప్పురులో అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్థ రాత్రి నుంచే అశ్వర్థ నారాయణస్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పూలతో అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు.
KRNL: తుగ్గలి మండలం చేపట్టిన ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని ఎంపీడీవో విశ్వమోహన్ ఆధికారులకు సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ సర్వే 80 శాతం పూర్తయ్యిందని.. మిగిలిన 20 శాతం సర్వేను ఈనెల 15వ తేదీ లోపు పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
VSP: గాజువాకలో విజయనగరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మసిటీలో పనిచేస్తున్న భాస్కరరావు శ్రీనగర్లో అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బందువులు దాడి చేసి ఇంట్లో బంధించారు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాజువాక పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ నగర పరిధిలో జనవరి ఒకటో తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేసిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్డులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ మానవాళితో పాటు పర్యావరణానికి హాని కలిగిస్తుందని అవగాహన కల్పించారు. ప్రజలందరూ ప్లాస్టిక్కు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను రక్షించాలన్నారు.
ATP: వైసీపీ సోషల్ మీడియా ఏర్పాటు చేసిన ట్విట్టర్ స్పేస్లో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యకర్తలు ఆధైర్య పడద్దని, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో గళం విప్పాలని వివరించారు.
KRNL: జిల్లాకు చెందిన యూట్యూబర్ రమణను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్పై ఓ వీడియోలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమణపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ATP: తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ను శనివారం సాయంత్రం అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది పని తీరుపై, పాత కేసులు పురోగతిపై ప్రశ్నించారు. అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాల బందోబస్తుపై సీఐ సాయి ప్రసాద్తో ఆరా తీశారు.
KRNL: అలారుదిన్నె గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి దెబ్బతినడంతో, శనివారం నుంచి నాలుగు చక్రాల వాహనాల రాకపోకలు నిషేధించబడ్డాయని రోడ్లు, భవనాల శాఖ డీఈఈ సురేష్ తెలిపారు. బళ్లారి, ఆలూరు నుంచి కర్నూలు వైపు వచ్చే వాహనాలను ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ మార్గాలతో మళ్లించడం జరిగిందని తెలిపారు. బళ్లారి వైపుకి వెళ్లే వాహనాలను కూడా మళ్లించడం జరిగిందని చెప్పారు.
కృష్ణా: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని, 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. శనివారం విజయవాడ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యాశాఖ అధికారులతో కలిసి పర్యటించారు.
NTR: కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో LLM పీజీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ శనివారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12 తేదీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్లో చూడవచన్నారు.
NDL: గతంలో YCPకి 23 ఎంపీ సీట్లు ఉన్నా కేంద్రంలో ఎన్డీఏ బలంగా ఉందని, ఇప్పుడు కేంద్రానికి ఏపీకి చెందిన 16 ఎంపీలు కీలకమైనప్పటికీ CM చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ తేలేకపోయారని YCP మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ‘పార్లమెంట్ అంతా బిహార్ వైపు చూస్తోంది. పునర్ వ్యవస్థీకరణలో ఎక్కువ నష్టపోయింది ఏపీనే’ అని బుగ్గన పేర్కొన్నారు.
AKP: అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి 7.10 గంటల వరకు 94.79 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మండలంలో 97.94 శాతం మందికి పెన్షన్ అందజేశామన్నారు. రెండో స్థానంలో చోడవరం, 3వ స్థానంలో కసింకోట, 4వ స్థానంలో నర్సీపట్నం ఉన్నాయి.
VSP: అనారోగ్య కారణంగా ఆర్కే బీచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ శనివారం కాపాడారు. ఎన్ఎడీ ప్రాంతానికి చెందిన నున్న చిట్టిబాబు (72) అనే వ్యక్తి అనారోగ్య రీత్యా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జీవీఎంసీ లైఫ్ గార్డులు ఆనంద్, ధనరాజ్, ఆయనను కాపాడి సీపీఆర్ చేసి అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు.
శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో మార్చ్ 8 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ విషయమై విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వం కార్యాలయలలో జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు.