GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోతురాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రధాన డ్రైన్లోని పూడికను (సిల్ట్) సిబ్బంది తొలగించారు. పట్టణంలో దోమల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.