TG: కామారెడ్డి జిల్లా కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీలోదారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వ్యక్తి శ్రవణ్(5) అనే చిన్నారిని హత్యచేశాడు. బాలుడి తల్లి లక్ష్మి భర్తతో విడిపోయి నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. ఈ క్రమంలో రాత్రి లక్ష్మి లేనప్పుడు ఆమె ఇంటికి వెళ్లిన నర్సింహులు.. శ్రవణ్ గొంతు నులిమి హత్య చేశాడు. అతనితో పాటు లక్ష్మినీ పోలీసులు అరెస్ట్ చేశారు.