ATP: జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా ఉన్నా, మారుతున్న వాతావరణం రైతులను కలవరపెడుతోంది. ఫిబ్రవరిలో ఆలస్యంగా వచ్చిన పూత జూన్ నాటికి కాయలుగా మారి కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో పూత మాడి రాలిపోతోంది. దీంతో ముందస్తుగా తోటలు కొన్న వ్యాపారులు, పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.