E.G: కడియం శ్రీ దేవి చౌక్ సెంటర్లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో నూతనంగా నిర్మించిన రేవును ఇవాళ ప్రారంభించారు. ఈ రేవు నిర్మాణానికి రూ. 2,65,000 లక్షల వ్యయంతో ఆధునికీకరించారు. ఆలయ అభివృద్ధికి దాత కేశన కుర్తి వెంకట లక్ష్మీ హనుమంతరావు దంపతుల కుమార్తె శ్రీదేవి సేవలను గ్రామ ప్రజలు ప్రశంసించారు.
KDP: గతనెల రోజులుగా అరటి ధరలు ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయాయి. రైతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం టన్ను అరటి రూ.6,000 నుంచి రూ.8,000 పలుకుతున్నాయి. ఈ ధరలు ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. కష్టపడి అరటి పంటలు సాగు చేస్తే.. దిగుబడులు వచ్చే సమయానికి ధరలు పతనమయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అన్నమయ్య: సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముని కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం సీతారామపురంలో స్వర్ణ గ్రామ, రైతు సేవ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఇవాళ ఎమ్మెల్యే ముక్క ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా ఈ భవనాలు ఉపయోగపడతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
KRNL: మంత్రాలయం ఉప సర్పంచ్ జంగం పరమేష్ స్వామి తనయుడు జంగం నవీన్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సీతారామిరెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
W.G: కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు హోటల్ యజమానులు ఆరోపిస్తున్నారు. పుల్లల పొయ్యిలపై ఇడ్లీలు తయారు చేస్తున్నామని ఆకివీడు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే కొందరు వ్యాపారాలు మూసివేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ రఫరా పునరుద్దించాలని స్థానికులు కోరుతున్నారు.
NTR: ఇబ్రహీంపట్నం, ఫెర్రీ ఏరియాల్లో రామాలయాల్లో సీతారామస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు సతీమణి శిరీష పాల్గొని, సంప్రదాయం ప్రకారం పూజలు చేసి, దేవతామూర్తులను దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.
KRNL: చిప్పగిరి మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రజలు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శ్రీరామ నవమి సందర్బంగ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
E.G: రాజమండ్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఇవాళ నిర్వహించారు. అనంతరం అభిమానులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. యువతలో స్ఫూర్తిని నింపేలా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించిన రామ్ చరణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
NLR: రాపూరు మండలం 7వ వార్డులో ఇవాళ డ్రైనేజీలు శుభ్రం చేశారు. కాలుష్యం కాలువల్లో పేరుకుపోయిన చెత్తను వార్డు మెంబర్ ఆరిఫా దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, నిర్దిష్ట ప్రదేశాల్లో వేయాలని సూచించారు.
కోనసీమ: మండపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జై శ్రీ రామ్’ అనే స్టికర్లు పంపిణీ చేశారు. రాములోరి కల్యాణం అందరకీ శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు పోతాయని తెలిపారు.
KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో సంక్షిప్త రామాయణ ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను బొమ్మల రూపంలో కళ్లకు కట్టినట్లు భక్తులకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రదర్శించారు. స్వయంవరంలో శివ ధనుర్బాణం విరుచుట, కళ్యాణం, వనవాసంలో మాయ బంగారు జింక, సీతమ్మ అపహరణ ఇలా ఎన్నో అద్భుత సన్నివేశాలను తీర్చిదిద్దారు.
TPT: రేణిగుంట CRS సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ బ్రాంచ్ ఛైర్మన్ మురుగప్రసాద్ను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు CRS రైల్వే కార్మికులు శుక్రవారం ఆయనను సన్మానించారు. అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
VZM: గరివిడి మండలం కొండపాలెం పంచాయతీలో జె.క్వార్టర్స్లో శుక్రవారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం పర్యటించారు. ఇంటి పన్నులు, కొళాయి పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ నెలాఖరు వరకు చెల్లించాలి అన్నారు. శానిటేషన్, మంచినీటి సరఫరాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఈవో వేణుగోపాలరావు పాల్గొన్నారు.
కోనసీమ: మండపేట నియోజకవర్గ ప్రజలకు ఇవాళ రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలన్నారు.