BPT: రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పశువులకు పరీక్షలు, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో మత్తి అనురాధ, గుర్రం మురహరి తదితరులు పాల్గొన్నారు.