SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో నర్సరీని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, మొక్కల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుందని అభినందించిన స్పెషల్ ఆఫీసర్, అవసరమైన సదుపాయాలను మరింత మెరుగుపరచాలని తెలిపారు.