MDK: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఏప్రిల్ 01 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీ.వీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సమయంలో అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లఘింస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.