VSP: సింహాచలం కొత్త గోశాలలో ఏప్రిల్ 1 నుంచి 5 వరకు శబల భోజనాల పండుగ నిర్వహించనున్నట్లు మిల్లెట్స్ రాంబాబు మంగళవారం తెలిపారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఉచితంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ పండుగను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు.