NLR: కందుకూరులో LIC అధికారులను బురిడీ కొట్టించి రూ.9 లక్షలు కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ ఎస్సై శివ నాగరాజు శనివారం తెలిపారు. LIC ఏజంట్గా ఉన్న శ్రీనివాసులు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి రూ.9 లక్షలు కాజేసిన వ్యవహారాన్ని ఆడిట్ అధికారులు గుర్తించారు. దాంతో శ్రీనివాసులును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై వివరించారు.