KDP: స్నపన తిరుమంజనం వేడుకగా ఒంటిమిట్ట కోదండ రామునికి మంగళవారం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడికి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టం స్వామి వారి వేదమంత్రాలు నడుమ అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.