CSKతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన అనంతరం రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 13 ఏళ్ల పాటు తాను ప్రాతినిధ్యం వహించిన జట్టుకు వ్యతిరేకంగా ఆడటం వింతగా అనిపించిందని అన్నాడు. అలాగే, CSK నుంచి వెళ్లిపోయిన తర్వాత ధోనీతో మాట్లాడలేదని తెలిపాడు. ఇప్పుడు తాము మాట్లాడుకోలేదు కానీ.. కలిసినప్పుడల్లా అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పుకొచ్చాడు.